Iran War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలు నెలకొన్నాయి. దీంతో ఇరాన్ చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. బుధవారం భారత్కు వస్తున్న కార్గో షిప్పై ఇరాన్ అటాక్ చేసింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇండియా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు ఫలించాయి. హార్ముజ్లో చిక్కుకున్న భారత ట్యాంకర్లకు ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది.
దీంతో, యుద్ధం ప్రారంభమైన తర్వాత హార్ముజ్ దాటిన తొలి నౌకగా భారత నౌక చరిత్ర సృష్టించింది. లైబీరియన్ జెండా కలిగిన చమురు ట్యాంకర్ ముంబై ఓడరేవుకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని రాస్ తనురా ఓడరేవులో ముడి చమురు లోడ్ను మోసుకెళ్తున్న ట్యాంకర్ షెన్లాంగ్ సూయెజ్మాక్స్ బుధవారం ఇరాన్ నౌకను ఇరుకైన జలమార్గం గుండా వెళ్ళడానికి అనుమతించిన తర్వాత ముంబైకి చేరుకుందని ముంబై పోర్ట్ ట్రస్ట్ తెలిపింది.
Read Also: Monalisa: మాది లవ్ జిహాద్ కాదు..ప్రతి మతాన్ని సమానంగానే భావిస్తా!
రెండు దేశాల విదేశాంగ మంత్రులు ఎస్ జైశకంకర్, అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన చర్చల తర్వాత చమురు ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని దాటడానికి అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. బ్రవరి 28న టెహ్రాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక ప్రచారం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ జలసంధిని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. ఈ మార్గం మూసేయడంతో ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారుడైన భారత్ ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సి వచ్చింది. దీంతో రష్యా నుంచి కొనుగోళ్లు కూడా పెరిగాయి.
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. 28 భారతీయ జెండా కలిగిన నౌకలు ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్నాయని తెలిపింది. వీటిలో, 677 మంది భారతీయ నావికులతో కూడిన 24 నౌకలు హోర్ముజ్ జలసంధికి పశ్చిమాన ఉన్నాయి, నాలుగు నౌకలు మరియు 101 మంది భారతీయ నావికులు జలసంధికి తూర్పున ఉన్నాయి. భారతీయ నౌకలు, నావికుల భద్రతను నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతకుముందు, బుధవారం కాండ్లా ఓడరేవుకు వస్తున్న థాయ్ నౌకపై హార్ముజ్లో దాడి జరగింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్లో ఇప్పటి వరకు 16 నౌకలపై దాడి జరిగింది.
