Rare Earth Elements: ఎలక్ట్రానిక్స్, పర్మినెంట్ అయస్కాంతాలు, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్, బ్యాటరీలు, టచ్ స్క్రీన్ల వంటి వాటి తయారీలో “రేర్ ఎర్త్ ఎలిమెంట్స్”గా పిలుబడే భూమిలో అత్యంత అరుదుగా లభించే మూలకాలు కీలకంగా మారాయి. అయితే, ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతుల్లో ప్రపంచవ్యాప్తంగా చైనా గుత్తాధిపత్యం నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ఎగుమతుల్ని ఈ దేశమే నియంత్రిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్కు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సేకరణ కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో మొత్తం 8.52 మిలియన్ టన్నుల ‘‘అరుదైన భూమి మూలకాలు’’ ఉన్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, గుజరాత్ మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో తీరప్రాంత బీచ్, తేరి మరియు ఎర్ర ఇసుక మరియు లోతట్టు ఒండ్రుమట్టిలో లభించే 13.15 మిలియన్ టన్నుల మోనాజైట్ (థోరియం, అరుదైన భూమి ఖనిజం)లో సుమారుగా 7.23 మిలియన్ టన్నుల అరుదైన రేర్ ఎర్త్ ఆక్సైడ్స్(REO) ఉందని, మరో 1.29 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుజరాత్, రాజస్థాన్ కొన్ని ప్రాంతాల్లోని కఠినమైన రాళ్లలో ఉన్నట్లు బుధవారం పార్లమెంట్కు సమాచారం అందింది.
Read Also: Vikarabad: దారుణం.. ప్రియుడు మోసం చేశాడని పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య..
అణుశక్తి శాఖ యొక్క ఒక విభాగమైన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (AMD) దేశంలోని పలు ప్రాంతాల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని అన్వేషిస్తోందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్సభకు లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. కొన్ని దేశాలు విధించిన అరుదైన భూమి అయస్కాంతాలపై ఎగుమతి పరిమితుల నుండి ఉత్పన్నమయ్యే సవాళ్లను తగ్గించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ సంబంధిత వాటాదారులతో చురుకుగా చర్చిస్తోందని మంత్రి చెప్పారు.
గనుల మంత్రిత్వ శాఖ ఆస్ట్రేలియా, అర్జెంటీనా, జాంబియా, పెరూ, జింబాబ్వే, మొజాంబిక్, మలావి, కోట్ డి’ఐవోయిర్ వంటి అనేక దేశాల ప్రభుత్వాలతో మరియు అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) వంటి అంతర్జాతీయ సంస్థలతో ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకుందని చెప్పారు. గనుల మంత్రిత్వ శాఖ జాయింట్ వెంచర్ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(KABIL)ను ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అర్జెంటీనాలోని లిథియం బ్లాకుల అన్వేషనతో పాటు బ్రెజిల్, డొమినికన్ రిపబ్లిక్తో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకున్నట్లు చెప్పారు.
