NTV Telugu Site icon

ఇండియా కరోనా అప్డేట్: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు… పెరిగిన మరణాలు 

ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  అయితే, నిన్నటి కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి.  తాజాగా దేశంలో 3,29,942 కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,92,517కి చేరింది.  ఇందులో 1,90,27,304 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,15,221 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 3,876 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్పటివరకు కరోనాతో 2,49,992 మంది మృతి చెందారు.  ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 3,56,082 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.  ఇకపోతే ఇప్పటి వరకు ఇండియాలో 17,27,10,066 మందికి వ్యాక్సిన్ అందించారు.