Site icon NTV Telugu

ఇండియా క‌రోనా అప్డేట్‌: త‌గ్గిన కేసులు… మ‌ర‌ణాలు…

ఇండియాలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.  తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 35,342 కేసులు…482 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,12,93,062కి చేరింది.  ఇందులో 3,04,68,079 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,05,513 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 4,19,470 మంది మృతి చెందారు.  గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో క‌రోనా నుంచి 38,740 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 42,34,17,030 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  

Read: అక్క‌డ ఈరోజు నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కు సంపూర్ణ లాడ్‌డౌన్‌…

Exit mobile version