India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
- భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల
- రైల్వే మంత్రిత్వ శాఖలో బుల్లెట్ ట్రైన్ చిత్రం
- సోషల్ మీడియాలో ఫొటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులు ఎప్పుడెప్పడా అంటూ ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ముంబై-అహ్మదాబాద్ మధ్య నడవనున్న దేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ డిజైన్ను రైల్వే శాఖ ఆవిష్కరించింది. దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖలో బుల్లెట్ ట్రైన్ చిత్రాన్ని ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేట్ నెంబర్ 4 దగ్గర ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటనలో తెలిపింది.
జపాన్ సహకారంతో రూపొందుతున్న ఈ బుల్లెట్ ట్రైన్ భారతీయ రైల్వే రంగంలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న ఈ రైలు గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ ట్రైన్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయం భారీగా తగ్గిపోనుంది. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
Also Read
- Priyanka Gandhi: ‘‘ అత్యాచార నిందితులకు మద్దతు’’.. ప్రహ్లాద్ జోషిపై ప్రియాంకాగాంధీ సంచలన వ్యాఖ్యలు..
- Rahul Gandhi: ‘అత్యంత నీచమైన వ్యక్తి’.. కొత్త విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఫైర్
- Bihar: దారుణం.. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేయసిని బైక్పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
- Delhi: జంతర్మంతర్ దగ్గర ధర్నాకు పోలీసుల ప్లాన్.. దేనికోసమంటే..!
ఇక ఫస్ట్ లుక్లో బుల్లెట్ ట్రైన్ ఆకర్షణీయమైన డిజైన్తో కనిపించింది. ఏరోడైనమిక్ ఆకృతితో రూపొందించిన ఈ రైలు ఆధునిక భారత రైల్వే అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని కేంద్ర రైల్వే శాఖ పేర్కొంది. భారత్లో బుల్లెట్ ట్రైన్ సేవలు ప్రారంభమైతే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
First look of India's Bullet Train unveiled, photo comes up at Railways Ministry Gate No 4
Read @ANI Story | https://t.co/JbwoHwy9rM#IndiaBulletTrain #RailwaysMinistry #IndianRailways pic.twitter.com/W6Y5Jzx4hn
— ANI Digital (@ani_digital) May 18, 2026
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీ వివాదం.. లోకేష్ రాజీనామా.. సీబీఐ విచారణకు జగన్ డిమాండ్
-
Bonda Uma: త్రీమెన్ కమిటీ ముందుకు బోండా ఉమా.. తన వ్యాఖ్యలపై క్లారిటీ.. ప్రతి మాటకు రికార్డు ఉంది..!
-
8000mAh బ్యాటరీ, 7-అంగుళాల OLED డిస్ప్లే, 50MP కెమెరా.. Redmi నుంచి కొత్త ఫోన్ విడుదల తేదీ ఖరారు..
-
Priyanka Gandhi: ‘‘ అత్యాచార నిందితులకు మద్దతు’’.. ప్రహ్లాద్ జోషిపై ప్రియాంకాగాంధీ సంచలన వ్యాఖ్యలు..
-
Kalyana Lakshmi: కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ కోసం అడ్డదారులు.. గుట్టురట్టు చేసిన పోలీసులు..
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!