Manmohan Singh: 1991 ఆర్థిక సంక్షోభం నుంచి భారతదేశాన్ని మన్మోహన్ సింగ్ ఎలా రక్షించారు..?
- భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం..
- 1991 ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడిన ఆర్థికవేత్త..
- పీవీ-మన్మోహన్ ద్వయం కారణంగా గొప్ప సంక్షోభం నుంచి సౌభాగ్యం వరకు..
- బంగారు తాకట్టు నుంచి 5 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేలా నిర్ణయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manmohan Singh: రెండు సార్లు భారత ప్రధానిగా, సంక్షోభ సమయంలో భారత ఆర్థిక మంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్(92) గురువారం తుదిశ్వాస విడిచారు. దేశాన్ని అత్యంత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ఇప్పుడు మనదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మారిందంటే అందులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేదని. దేశాన్ని దివాళా తీసే పరిస్థితి నుంచి తన ఆర్థిక శక్తిగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్ కే దక్కుతుంది. పీవీ నరసింహరావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా తన సత్తా చాటారు.
దేశ ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా, దేశాన్ని ఒక చీకటి ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేశారు. 1991 మధ్య నాటికి భారత దేశ విదేశీ నిల్వలు తక్కువగా ఉన్నాయి. ద్రవ్యోల్భణం రెండంకెలకు చేరింది. భారీ ఆర్థిక లోటు దేశాన్ని కుదేలు చేసే ప్రమాదం ఏర్పడింది. సావరిన్ డిఫాల్ట్ని నివారించే కష్టమైన పనిని అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఎదుర్కొన్నారు. ప్రధాని పీవీ నరసింహరావు, మన్మోహన్ సింగ్ దశాబ్ధాల నాటి భారత ఆర్థిక వ్యవస్థ సంకెళ్లను తెంచారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థని సరళీకరణ మార్గంలోకి తెచ్చారు.
Also Read
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
Read Also: Kamran Ghulam: ఛీ.. ఛీ.. మరి ఇంత దిగజారాలా? బండ బూతులతో రెచ్చిపోయిన పాకిస్థాన్ క్రికెటర్
దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. 1991 జూలైలో రెండుసార్లు రూపాయి విలువను తగ్గించారు. భారతదేశ ఎగుమలను మరింత పోటీతత్వంలోకి వచ్చేలా చేశారు. దీని వల్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించేలా చేశారు. ఇదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ బ్యాంకుకు 47 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టింది. మారక నిల్వల్ని పెంచుకోవడానికి 600 మిలియన్ డాలర్లను సేకరించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి వచ్చిన అత్యవసర రుణాలు మొత్తం 2 బిలియన్ డాలర్లు దేశాన్ని ప్రమాదం అంచు నుంచి రక్షించాయి.
ఇలాంటి పరిస్థితుల్లో, జూలై 24న మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ని సమర్పించారు. దశాబ్దాలుగా పారిశ్రామిక వృద్ధికి అడ్డుకట్ట వేసే బ్యూరోక్రాటిక్ నియంత్రణల వలయం లైసెన్స్ రాజ్ను బడ్జెట్ రద్దు చేసింది. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థ పరుగెత్తడానికి సహకరించింది. ఇది విదేశీ పెట్టుబడుల పరిమితిని సడలించింది. 51 శాతం వరకు ఈక్విటీ వాటాల కోసం ఆటోమేటిక్ అమోదాలనున అనుమతిస్తుంది. 18 క్లిష్టమైన రంగాలకు మినహా అన్నింటికి పారిశ్రామిక లైసెన్సింగ్ని రద్దు చేసింది.
కార్పొరేట్ పన్నుల్ని పెంచారు. వంటగ్యాస్ మరియు చక్కెర వంటి నిత్యావసరాలపై సబ్సిడీలు తగ్గించబడ్డాయి. పెట్రోల్ ధరలు పెరిగాయి. ‘‘ సమయానికి వచ్చిన ఆలోచనను భూమిపై ఏ శక్తి ఆపదు’’అని 1991 బడ్జెట్ సమావేశంలో సింగ్ చెప్పారు. భారతదేశాన్ని కష్టాలను అధిగమించిగల సామర్థ్యంపై తన నమ్మకాన్ని ప్రకటించేలా కామెంట్స్ చేశారు. కొత్త వాణిజ్య విధానం దిగుమతి-ఎగుమతి నిబంధనల్ని సరలించింది. రాజా చెల్లయ్య, M. నరసింహం వంటి ఆర్థికవేత్తల నేతృత్వంలోని కమిటీలు భారతదేశ ఆర్థిక , పన్నుల వ్యవస్థల్లో నిర్మాణాత్మక మార్పులను ప్రవేశపెట్టాయి. ఈ సంస్కరణలు విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించింది. పరిశ్రమని ఆదునీకీకరించాయి. రెండు ఏళ్లలోనే భారత విదేశీ నిల్వలు 1 బిలియన్ డాలర్ల కంటే తక్కువ నుంచి 10 బిలియన్ డాలర్లకు పెరిగింది.
తాజావార్తలు
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!