Manmohan Singh: 1991 ఆర్థిక సంక్షోభం నుంచి భారతదేశాన్ని మన్మోహన్ సింగ్ ఎలా రక్షించారు..?
- భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం..
- 1991 ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడిన ఆర్థికవేత్త..
- పీవీ-మన్మోహన్ ద్వయం కారణంగా గొప్ప సంక్షోభం నుంచి సౌభాగ్యం వరకు..
- బంగారు తాకట్టు నుంచి 5 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేలా నిర్ణయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manmohan Singh: రెండు సార్లు భారత ప్రధానిగా, సంక్షోభ సమయంలో భారత ఆర్థిక మంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్(92) గురువారం తుదిశ్వాస విడిచారు. దేశాన్ని అత్యంత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ఇప్పుడు మనదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మారిందంటే అందులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేదని. దేశాన్ని దివాళా తీసే పరిస్థితి నుంచి తన ఆర్థిక శక్తిగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్ కే దక్కుతుంది. పీవీ నరసింహరావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా తన సత్తా చాటారు.
దేశ ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా, దేశాన్ని ఒక చీకటి ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేశారు. 1991 మధ్య నాటికి భారత దేశ విదేశీ నిల్వలు తక్కువగా ఉన్నాయి. ద్రవ్యోల్భణం రెండంకెలకు చేరింది. భారీ ఆర్థిక లోటు దేశాన్ని కుదేలు చేసే ప్రమాదం ఏర్పడింది. సావరిన్ డిఫాల్ట్ని నివారించే కష్టమైన పనిని అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఎదుర్కొన్నారు. ప్రధాని పీవీ నరసింహరావు, మన్మోహన్ సింగ్ దశాబ్ధాల నాటి భారత ఆర్థిక వ్యవస్థ సంకెళ్లను తెంచారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థని సరళీకరణ మార్గంలోకి తెచ్చారు.
Also Read
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
Read Also: Kamran Ghulam: ఛీ.. ఛీ.. మరి ఇంత దిగజారాలా? బండ బూతులతో రెచ్చిపోయిన పాకిస్థాన్ క్రికెటర్
దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. 1991 జూలైలో రెండుసార్లు రూపాయి విలువను తగ్గించారు. భారతదేశ ఎగుమలను మరింత పోటీతత్వంలోకి వచ్చేలా చేశారు. దీని వల్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించేలా చేశారు. ఇదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ బ్యాంకుకు 47 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టింది. మారక నిల్వల్ని పెంచుకోవడానికి 600 మిలియన్ డాలర్లను సేకరించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి వచ్చిన అత్యవసర రుణాలు మొత్తం 2 బిలియన్ డాలర్లు దేశాన్ని ప్రమాదం అంచు నుంచి రక్షించాయి.
ఇలాంటి పరిస్థితుల్లో, జూలై 24న మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ని సమర్పించారు. దశాబ్దాలుగా పారిశ్రామిక వృద్ధికి అడ్డుకట్ట వేసే బ్యూరోక్రాటిక్ నియంత్రణల వలయం లైసెన్స్ రాజ్ను బడ్జెట్ రద్దు చేసింది. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థ పరుగెత్తడానికి సహకరించింది. ఇది విదేశీ పెట్టుబడుల పరిమితిని సడలించింది. 51 శాతం వరకు ఈక్విటీ వాటాల కోసం ఆటోమేటిక్ అమోదాలనున అనుమతిస్తుంది. 18 క్లిష్టమైన రంగాలకు మినహా అన్నింటికి పారిశ్రామిక లైసెన్సింగ్ని రద్దు చేసింది.
కార్పొరేట్ పన్నుల్ని పెంచారు. వంటగ్యాస్ మరియు చక్కెర వంటి నిత్యావసరాలపై సబ్సిడీలు తగ్గించబడ్డాయి. పెట్రోల్ ధరలు పెరిగాయి. ‘‘ సమయానికి వచ్చిన ఆలోచనను భూమిపై ఏ శక్తి ఆపదు’’అని 1991 బడ్జెట్ సమావేశంలో సింగ్ చెప్పారు. భారతదేశాన్ని కష్టాలను అధిగమించిగల సామర్థ్యంపై తన నమ్మకాన్ని ప్రకటించేలా కామెంట్స్ చేశారు. కొత్త వాణిజ్య విధానం దిగుమతి-ఎగుమతి నిబంధనల్ని సరలించింది. రాజా చెల్లయ్య, M. నరసింహం వంటి ఆర్థికవేత్తల నేతృత్వంలోని కమిటీలు భారతదేశ ఆర్థిక , పన్నుల వ్యవస్థల్లో నిర్మాణాత్మక మార్పులను ప్రవేశపెట్టాయి. ఈ సంస్కరణలు విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించింది. పరిశ్రమని ఆదునీకీకరించాయి. రెండు ఏళ్లలోనే భారత విదేశీ నిల్వలు 1 బిలియన్ డాలర్ల కంటే తక్కువ నుంచి 10 బిలియన్ డాలర్లకు పెరిగింది.
తాజావార్తలు
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!