Himalayas: 2100 నాటికి హిమాలయాల్లోని 75 శాతం మంచు కనుమరుగు.. ఆసియా ప్రజలపై తీవ్ర ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himalayas: ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం వాతావరణ మార్పులను ప్రేరేపిస్తున్నాయి. ధృవాల వద్ద మంచు కరిగిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే శతాబ్ధంలో భూమి విపరీత వైపరీత్యాలను ఎదుర్కొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంటార్కిటికాలో పెద్ద మంచు ఫలకం క్రమంగా కరుగుతోంది. ఇదిలా ఉంటే, స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ 2024 నివేదిక కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. 2100 నాటికి హిమాలయాల్లోని 75 శాతం మంచు కనుమరుగు అయ్యే అవకాశం ఉందని, ఇది ఆసియాలో బిలియన్ల ప్రజలపై ప్రభావం చూపుతుందని తెలిపింది.
హిమాలయాల ఎగువ ప్రాంతాల్లో వేగవంతంగా హిమానీనదాలు 65 శాతం రేటుతో కరుగుతున్నాయని, ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. 2013 నుండి 2022 వరకు భారతదేశం యొక్క ప్రకృతి వైపరీత్యాలలో 44 శాతం భారాన్ని ఈ హిమాలయ ప్రాంతాలే భరించినట్లు నివేదిక వెల్లడించింది. భయంకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడటం, క్లైడ్ బరస్ట్ వంటివి హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న తీవ్రతను సూచిస్తున్నాయి.
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
Read Also: Director Krish: నేను ఎక్కడికి పారిపోలేదు.. ఈ కేసులో నన్ను కావాలనే ఇరికించారు
స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్విరాన్మెంట్లో పర్యావరణ వనరుల విభాగం చీఫ్ కిరణ్ పాండే పరిస్థితి తీవ్రతను నొక్కిచెప్పారు. ఈ విపత్తులు తరుచుగా సంభవిస్తున్నాయని, మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని, గణనీయమైన ప్రాణ, ఆస్తి నష్టాలకు దారి తీయొచ్చని హెచ్చరించారు. ఈ హిమానీనదాల నుంచి వచ్చే నీటిపై ఆధారపడుతున్న ఆసియాలోని రెండు బిలియన్ల ప్రజల జీవితాలకు ముప్పు ఉందని చెప్పారు. క్లౌడ్ బరస్ట్ల ద్వారా కొత్త సరస్సుల ఆవిర్భావం ప్రమాదాలను మరింతగా పెంచుతుందని, ఈ సరస్సులు పొంగిపొర్లినప్పుడల్లా వరదల వస్తాయని చెప్పారు.
ఇక హిమాలయాల్లోని వృక్ష సంపదలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. హిమాలయ వ్యవసాయంలో 90 శాతం వర్షపాతంపై ఆధారపడి ఉండటంతో ఈ ప్రాంతంలో జీవనోపాధి స్థిరత్వం ప్రమాదంలో పడుతుంది. 40 శాతం మంచును హిమాలయాలు ఇప్పటికే కోల్పోగా.. ఇదే కొనసాగితే.. ఈ శతాబ్ధ చివరి నాటికి 75 శాతం వరకు మంచు కనుమరుగయ్యే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.
తాజావార్తలు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!