Site icon NTV Telugu

Hijab Row : హిజాబ్ ముస్లిం మహిళ గుర్తింపు

కర్ణాటకలో హిజాబ్‌పై వివాదం చేలరిగి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘హిజాబ్’ ‘పర్దా’లకు వ్యతిరేకంగా నిరసనల పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యక్తులను ఎదుర్కోవడానికి ముస్లిం మహిళలు తప్పనిసరిగా ముందుకు రావాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) పేర్కొంది. “నా ప్రియమైన సోదరీమణులారా, హిజాబ్ గురించి ప్రజలకు తెలియజేయడానికి, పక్షపాతాన్ని పారద్రోలడానికి, మీరు హిజాబ్‌తో అణచివేయబడలేదని, కానీ దానితో గౌరవంగా మరియు స్వేచ్ఛగా ఉన్నారని తెలియజేయడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. మీ విజయం ముస్లింలందరి విజయం” అని సోషల్ మీడియా సెషన్‌లో బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా ఉమ్రైన్ మహఫూజ్ రహ్మానీ అన్నారు.

“హిజాబ్ ఒక ముస్లిం మహిళ యొక్క గుర్తింపు. ఇది సమాజంలోని పైశాచిక అంశాల నుండి రక్షిస్తుంది. శతాబ్దాలుగా, ఏ సమాజం నగ్నత్వాన్ని ఆలింగనం చేసుకునే దిశగా వెళుతుందో, అది అల్లాహ్ శాపం, కోపంతో నాశనం చేయబడింది, ”అని ఆయన అన్నారు. మహిళలు ఇంటి నుండి బయటకు రాకుండా ఇస్లాం ఆపలేదని మతపెద్దలు వెల్లడించారు. “మీ గౌరవానికి ఎలాంటి ఆటంకం కలగని విధంగా బయటకు వెళ్లండి. ఇస్లాం ఇష్టపడేది ఇదే,” అని ముస్లిం మహిళలు తమ జీవితంలో హిజాబ్‌ను అంగీకరించాలని కోరారు. “హిజాబ్ ధరించే ముస్లిం మహిళలు దాని గురించి ఇతరులకు తెలియజేయాలి. ఇది ప్రచారాన్ని ఆపివేస్తుంది. హిజాబ్‌పై ద్వేషాన్ని ఎదుర్కొంటుంది”అని మౌలానా అన్నారు.

Exit mobile version