Karnataka : దంచికొడుతున్న భారీ వర్షాలు..స్కూళ్లు, కాలేజీలకు సెలవులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశంలో ఎటు చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. పలు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు జనాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. కర్ణాటక లో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రమంతా వరదలతో నిండిపోయింది.. ఎటు చూసిన నీళ్లు ఉండటంతో జనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.. చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలు మూతపడ్డాయి..మరో ఐదు రోజుల పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా దక్షిణ కన్నడ ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్టు అధికారులు పేర్కొన్నారు..
వివరాల్లోకి వెళితే..కర్నాటకలోని దక్షిణ కన్నడ ప్రాంతంలో వానలు దంచికొడుతున్నాయి. కుండపోత వర్షం నేపథ్యంలో ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు. ఈ క్రమంలోనే దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ జూలై 4 న మంగళూరు, బంట్వాల్, ముల్కి, మూడ్బిద్రి, ఉల్లాల్ లోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక-ఉన్నత పాఠశాల, ప్రీ-యూనివర్శిటీ, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు సెలవు ప్రకటించారు.. అదే విధంగా మరో రెండు రోజుల పాటు ఆరెంజ్ అలెర్ట్ ను ప్రకటించారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు..
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్లను పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివద్దని అధికారులు సూచించారు.. అలాగే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. జిల్లా, తాలూకా స్థాయి అధికారులు సిద్ధంగా ఉండాలనీ, విపత్తు నిర్వహణ చర్యలను నిర్విఘ్నంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఏరియాకు కేర్ సెంటర్ ను సిద్ధంగా ఉంచాలని డిపార్ట్ మెంటల్ అధికారులను ఆదేశించినట్లు డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కోస్తా ప్రాంతాలను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బళ్లారి, చామరాజ్ నగర్, చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ, దక్షిణ కన్నడ, దావణగిరి, కోలార్, కొప్పల్ రాయచూర్, ఉత్తర కన్నడ జిల్లాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది.. అలాగే ఆంధ్రప్రదేశ్ కు కూడా భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!