IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక
- దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు ఉంటాయని వార్నింగ్
- అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. సోమవారంత భారీ వర్షంతో పాటు వడగళ్లు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాలతో పాటు దక్షిణ రాష్ట్రాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో విస్తారంగా వర్షం, మంచు కురవడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తుఫానులు ఉంటాయని పేర్కొంది. అలాగే గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక కాశ్మీర్ లోయలో అక్కడక్కడా భారీ వర్షం లేదా హిమపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- 60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
- PM Modi: నేటితో 56వ వసంతంలోకి రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..
ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్లో రోజంతా ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ఇక పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాతో సహా తూర్పు భారతదేశంలో కూడా వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పింది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, సిక్కింలో అక్కడక్కడా భారీ వర్షాలు, వడగళ్ల వాన పడే ఛాన్సుందని తెలిపింది. అలాగే మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
దక్షిణ భారత్లో కూడా..
అలాగే దక్షిణ భారత్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడుతో సహా దక్షిణ రాష్ట్రాల్లో ఈ వారమంతా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ప్రజలకు హెచ్చరిక
ఉరుములతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మెరుపులు మెరుస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వడగళ్ల వాన ఎక్కువగా పడే ప్రాంతాల్లోని రైతులు, నివాసితులు పంటలను, ఆస్తులను కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
తాజావార్తలు
-
AP Women’s Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?