మాదకద్రవ్యాల స్మగ్లింగ్పై పోలీసులు, కస్టమ్స్ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదకద్రవ్యాల రవాణాపై అడుగడుగునా తనిఖీల చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారిన అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే తాజాగా ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఉగాండాకు చెందిన మహిళ ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆమె వెంట తీసుకువచ్చిన లగేజి బ్యాగ్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
దీంతో 107 క్యాప్సల్స్లో హెరాయిన్ నింపి బట్టల మధ్యలో పెట్టి తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీంతో సదరు మహిళను అదుపులోకి తీసుకొని, ఎన్డీసీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే సీజ్ చేసిన హెరాయిన్ బరువు 1060 గ్రాములు ఉన్నట్లు దాని విలువ రూ.7.43 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
