Govt raises MSP: రైతులకు గుడ్ న్యూస్.. ఆరు పంటలకు మద్దతు ధర పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govt raises MSP on wheat by Rs 110: కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల సంక్షేమం కోసం, రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా పలు పంటల మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022-24 ఆర్థిక సంవత్సరం రబీ సీజన్ కు గానూ.. 6 పంటలకు మద్దతు ధరలను పెంచింది. గోధుమ కనీస మద్దతు ధర క్వింటాల్ కు రూ. 110 పెంచింది. దీంతో క్వింటాల్ గోధుమల ధర రూ. 2,125కు చేరింది. ఇదే విధంగా అవాలకు రూ.400 మద్దతు ధర పెంచింది. దీంతో క్వింటాల్ ఆవాల ధర రూ. 5,450కు పెరిగింది.
Read Also: Gujarat: షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) ఎంఎస్పీ పెంపు నిర్ణయం తీసుకున్నారు. గోధుమ, ఆవాలు రబీ సీజన్ లో ప్రధాన పంటలుగా ఉన్నాయి. దీంతో ఈ రెండు పంటలకు మద్దతు ధర పెంచడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్, రబీ కాలాల్లో సాగయ్యే 23 పంటలకు కేంద్ర మద్దతు ధరలను నిర్ణయిస్తూ ఉంటుంది. 2021-22 ఏడాదిలో ప్రధాన పంట అయిన గోధుమకు రూ. 2,015 మద్దతు ధర ఉండేది ప్రస్తుతం ఎంఎస్పీ పెంచడంతో క్వింటాల్ ధర రూ. 2,125కు చేరింది. గోధుమ ఉత్పత్తి వ్యయం క్వింటాల్ కు రూ. 1,065గా కేంద్రం అంచానా వేస్తోంది.
మిగతా పంటల విషయానికి వస్తే బార్లీకి మద్దతు ధర రూ. 100 పెంచింది. దీంతో క్వింటాల్ బార్లీ ధర రూ. 1735కు చేరింది. ఇదే విధంగా శెనిగలకు రూ. 105 పెంచింది. క్వింటాల్ శనిగల ధర రూ. 5,335కు చేరింది. కందులకు రూ. 500 మద్దతు ధర పెంచింది. క్వింటాల్ కందుల ధర రూ. 6,000 కు చేరుకుంది. సన్ ఫ్లవర్ మద్దతు ధర రూ. 209కి పెంచింది. క్వింటాల్ సన్ ఫ్లవర్ ధర రూ.5650కు చేరుకుంది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!