Site icon NTV Telugu

ప్రధాని మోడీని కలిసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ. హర్యాణా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నేడు ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు బండారు దత్తాత్రేయ. ఈ సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుకున్నారు ప్రధాన మంత్రి. అలాగే… హరియాణా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న ప్రధాని… కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో గవర్నర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ఇక ప్రధాన మంత్రి మోడీ భేటీ తన మరింత స్ఫూర్తినిచ్చిందని తెలిపారు గవర్నర్ బండారు దత్తాత్రేయ.

Exit mobile version