కరోనా మహమ్మారి దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కరోనా విజృంభించిన సమయంలో రేషన్ను ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. మే, జూన్ నెలలకు కూడా కేంద్రం ఉచితంగా రేషన్ను అందించింది. కాగా, ఈ రేషన్ మరో 5 నెలలపాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జులై నెల నుంచి నవంబర్ వరకు ఉచిత రేషన్ను అందించాలని నిర్ణయం తీసుకుంది.
Read: ‘తిరై ఇసై చక్రవర్తి’ ఎమ్మెస్ విశ్వనాథన్!
బియ్యం రేషన్ కార్డు ఉన్నవారికి ఇంట్లో ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం అందించాలని నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సెకండ్ వేవ్ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండటంతో పాటుగా, మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
