Site icon NTV Telugu

Shivraj Singh Chouhan: రైతులకు గుడ్‌న్యూస్.. పలు రకాల విత్తనాలు ఉచితంగా అందిస్తామన్న కేంద్రమంత్రి

Shivrajsinghchouhan

Shivrajsinghchouhan

అన్నదాతలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గుడ్‌న్యూస్ చెప్పారు. కొత్త వ్యవసాయ ఉత్పత్తుల కోసం రైతులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ చొరవతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) అభివృద్ధి చేసిన బ్రీడర్, సర్టిఫైడ్ మరియు ఫౌండేషన్ విత్తనాలను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని శివరాజ్‌సింగ్ తెలిపారు. నూనె గింజల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన 21 రాష్ట్రాల్లోని 347 జిల్లాలపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా 600 క్లస్టర్లలో రైతులకు ఉచితంగా బ్రీడర్, సర్టిఫైడ్ మరియు ఫౌండేషన్ విత్తనాలను ప్రభుత్వం అందజేస్తుందని వ్యవసాయ మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి: Chhattisgarh Encounter: ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్‌లో కీలక నేతల హతం?

భోపాల్‌లో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. భారతదేశం అంతటా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మరియు రైతులను ఆదుకోవడానికి ఉద్దేశించిన అనేక ముఖ్యమైన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ (ఎన్‌ఎంఈఓ-ఆయిల్‌సీడ్స్) కింద రైతులకు ఉచితంగా బ్రీడర్ విత్తనాలు, సర్టిఫైడ్ విత్తనాలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన ఫౌండేషన్ విత్తనాలను అందించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన చెప్పారు.

నూనెగింజల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన 21 రాష్ట్రాల్లోని 347 జిల్లాలపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా 600 క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంతాల్లోని రైతులు ఉచిత విత్తనాలను అందుకోవడమే కాకుండా దిగుబడిని పెంచడానికి అధునాతన వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇస్తామని చెప్పారు. రైతులు పండించిన ఉత్పత్తులను 100 శాతం కొనుగోలు చేసేలా చూస్తామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Student suicide: ప్రిన్సిపల్ వేధింపులతో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం..

ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకం విషయంలో ఇటీవలి నిర్ణయాలు దేశీయ ఉత్పత్తి మరియు ధరలను సానుకూలంగా ప్రభావితం చేస్తున్నాయని చౌహాన్ తెలిపారు. సోయాబీన్, ఆవాలు, పొద్దుతిరుగుడు వంటి ఎడిబుల్ ఆయిల్‌లపై గతంలో 0% ఉన్న దిగుమతి సుంకాన్ని ఇప్పుడు 27.5%కి పెంచినట్లు వివరించారు. న్యాయమైన పరిహారం అందేలా ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి రైతుల నుంచి సోయాబీన్‌ను కొనుగోలు చేస్తుందన్నారు.

ఇది కూడా చదవండి: HYDRA: హైడ్రాకి చట్ట బద్దత.. ఆర్డినెన్సుపై సంతకం చేసిన గవర్నర్

Exit mobile version