Anna Sebastian Perayil: పని ఒత్తిడితో మరణించిన అన్నా సెబాస్టియన్.. ఈ నెలలో వివాహం జరగాల్సి ఉంది..
- సంచలనంగా మారిన అన్నా సెబాస్టియన్ మృతి..
- పని ఒత్తిడే కారణమని తల్లి ఆరోపణ..
- ఈ నెలలో వివాహం కావాల్సి ఉందన్న కజిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anna Sebastian Perayil: ఎర్నెస్ట్ అండ్ యంగ్(EY) ఇండియా కంపెనీలో పనిచేసే 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కార్పొరేట్ వర్క్ కల్చర్, పని ఒత్తిడి ఆమె మృతికి కారణమైనట్లు ఆమె తల్లి ఆరోపించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అన్నా మరణం తర్వాత దేశవ్యాపంగా చాలా మంది ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని సోషల్ మీడియా వ్యాప్తంగా హైలెట్ చేశారు. కొందరు కార్పొరేట్ ఉద్యోగం అంటే చాలా కష్టమంటూ వ్యాఖ్యానించారు. మరికొందరు కొన్ని కంపెనీల్లో తమపై సీనియర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, వారిని ఎదిరిస్తే పని ఒత్తిడితో వేధిస్తున్నారంటూ చెప్పారు. కేరళ కొచ్చికి చెందిన అన్నా సెబాస్టియన్ ఈ ఏడాది జూలై 20న మరణించారు. ఆఫీసులోనే తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స చెందుతూ మరణించారు.
Read Also: Ashok Galla: అశోక్ గల్లా హీరోగా రొమాంటిక్ కామెడీ డ్రామా.. క్లాప్ కొట్టిన నమ్రత
Also Read
- Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
- NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్హౌజ్..
ఇదిలా ఉంటే, అన్నాకి ఈ నెలలో వివాహం జరగాల్సి ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. అన్నా తల్లి అనితా అగస్టిన్ EY ఇండియా ఛైర్మన్ రాజీవ్ మెమానీకి తన కుమార్తె పనిలో ఎదుర్కొన్న సవాళ్లపై ఒక లేఖ రాసిన తర్వాత, ఆయన సామరస్యపూర్వకమైన ఆఫీసుని రూపొందించే వరకు తాను విశ్రమించనని చెప్పారు.
అన్నాతో ఉన్న అనుబంధాన్ని ఆమె కజిన్ సునీల్ జార్జ్ కురువిల్లా పంచుకున్నారు. శుక్రవారం ఆయన లింక్డ్ఇన్లో పెట్టిన పోస్ట్ కన్నీళ్లు తెప్పించాయి. అన్నా శాశ్వతంగా వెళ్లిపోయింది, కానీ ఆమె గతంలో కన్నా మరింత శక్తివంతంగా మారిందని అన్నారు. అధికారుల బారి నుంచి యువ జీవితాలను ఆమె రక్షించవచ్చని అన్నారు. ఈ నెలలోనే ఆమెకు పెళ్లి నిశ్చయమైంది అని చెప్పారు. అన్నా మరణం తర్వాత ఉద్యోగుల పని గంటల్లో మార్పులు రావాలనే ప్రతీ ఒక్కరు వ్యాఖ్యానిస్తున్నారు. కేరళ ఎంపీ శశిథరూర్ ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానని అన్నారు.
తాజావార్తలు
-
Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ సోదరి ఎమోషనల్ పోస్ట్.. రాముడి రూపంలో సోదరుడి చిత్రాన్ని పంచుకుంటూ నివాళి
-
Gautam Gambhir: అబ్బబ్బా ఏం షాట్ అది.. బిత్తరపోయిన గౌతమ్ గంభీర్.. వీడియో వైరల్!
-
Home Loan : హోమ్ లోన్ తీసుకుంటున్నారా ? ఈ పొరపాటును మాత్రం అస్సలు చేయకండి
-
sonam wangchuk: “మాకు మంత్రి పదవులపై ఆశ లేదు”.. విద్యా వ్యవస్థ లోపాలపై సోనామ్ వాంగ్చుక్ కీలక వ్యాఖ్యలు..
-
9000mAh Battery Smartphones 2026: 9000mAh బ్యాటరీతో 2026లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. పూర్తి జాబితా!
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!