Site icon NTV Telugu

Breaking News: బీజేపీ కార్యాలయం వెలుపల పేలుడు..

Bjp

Bjp

Breaking News: పంజాబ్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయం వెలుపల పేలుడు సంభవించింది. ఛండీగడ్ బీజేపీ కార్యాలయం బయట స్కూటర్‌ పేలినట్లు తెలిసింది. ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో సమీపంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

Read Also: Digital Payments: ఏప్రిల్ 1 నుంచి పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త.. నేటి నుంచి OTP ఒక్కటే ఎందుకు పని చేయదు?

చండీగఢ్‌లోని సెక్టార్ 37లో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడుకు గల కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ పేలుడు పెద్ద తీవ్రత కాదని సమాచారం. పంజాబ్ బీజేపీ కార్యాలయం బయట సీఆర్పీఎఫ్‌ను మోహరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంఘటనా స్థలం నుంచి పేలుడు తర్వాత ఎగిసిపడిన శకలాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడుకు ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

Exit mobile version