West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్‌లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు

  • బెంగాల్ 2వ దశ పోలింగ్‌
  • పోలింగ్ ప్రారంభమైన తొలి గంటల్లోనే హౌరాలో EVM లోపం
  • హౌరాలో హింసాత్మక ఘటనలు
West Bengal Assembly Electi

West Bengal Assembly Electi

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల రెండవ దశ పోలింగ్ ఏప్రిల్ 29, 2026 (బుధవారం)న ఏడు జిల్లాల్లోని 142 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. శాంతియుత, పారదర్శక పోలింగ్‌ను నిర్ధారించడానికి ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. కోల్‌కతాలో మాత్రమే సుమారు 35,000 మంది భద్రతా దళాలు nasa ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాల నుంచి 2,550 కంపెనీలు విధుల్లో ఉన్నాయి. పారదర్శకత కోసం 142 సాధారణ పరిశీలకులు, 95 పోలీసు పరిశీలకులను నియమించారు. ఏవైనా తీవ్రమైన హింసాత్మక సంఘటనలు జరిగితే స్పందించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ ను ఈ ఎన్నికల్లో తొలిసారిగా రంగంలోకి దింపారు.

ఈ దశలో అనేక ముఖ్యమైన నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా భబానిపూర్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (TMC) vs సువేందు అధికారి (BJP) మధ్య హై-వోల్టేజ్ పోరు జరుగుతోంది. ఈ సీటు ఫలితం రాష్ట్ర రాజకీయాలపై బలమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ దశలో 8 మంత్రులు సహా మొత్తం 1,448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సుమారు 3.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశలో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఓట్ల లెక్కింపు మే 4, 2026న జరగనుంది.

పోలింగ్ ప్రారంభమైన తొలి గంటల్లోనే హౌరాలో EVM లోపం కారణంగా గందరగోళం ఏర్పడింది. ఇంకా చప్రా, శాంతిపూర్, నిమ్తలా, భాంగర్ తదితర ప్రాంతాల్లో కొన్ని హింసాత్మక ఘటనలు, విధ్వంసాలు నమోదయ్యాయని పోలీసు వర్గాలు తెలిపాయి. భబానిపూర్లో మమతా బెనర్జీ తన బూత్‌లను వ్యక్తిగతంగా తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను కూడా ప్రారంభించింది. సువేందు అధికారి మాట్లాడుతూ, బీజేపీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని, మమతా బెనర్జీని భబానిపూర్‌లో ఓడించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.