DK Shiva Kumar : కేపీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌పై ఈడీ చార్టిషీట్‌

Dk Shiva Kumar

Dk Shiva Kumar

మనీలాండరింగ్ కేసులో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో పాటు తదితరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జి షీట్ దాఖలు చేసింది. ఐటీ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో శివకుమార్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఢిల్లీ కోర్టులో ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ)లోని వివిధ సెక్షన్ల కింద ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసినట్లు వారు తెలిపారు. ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ సెప్టెంబర్ 2018లో శివకుమార్, న్యూఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో ఉద్యోగి హౌమంతయ్య ఇతర వ్యక్తులపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

పన్ను ఎగవేత, హవాలా లావాదేవీల ఆరోపణలపై బెంగళూరులోని కోర్టులో శివకుమార్, ఇతరులపై ఆదాయపు పన్ను శాఖ చార్జిషీట్ దాఖలు చేసింది. శివకుమార్, అతని సహచరుడు ఎస్‌కె శర్మ మరో ముగ్గురు నిందితుల సహాయంతో ‘హవాలా’ మార్గాల ద్వారా రోజూ భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదును రవాణా చేశారని ఐటీ డిపార్ట్‌మెంట్ ఆరోపించింది. 60 ఏళ్ల శివకుమార్‌ను ఈ కేసులో 2019లో ఈడీ అరెస్టు చేసింది. ఆయన కుమార్తె ఐశ్వర్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్‌తో సహా అనేక మంది వ్యక్తులు మరియు సహచరులను గతంలో ఏజెన్సీ ప్రశ్నించింది.