Train Derailment: ఏనుగులను ఢీకొట్టి పట్టాలు తప్పిన రైలు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- అస్సాంలో తప్పిన రైలు ప్రమాదం
- ఒక్కసారిగా పట్టాలపైకి వచ్చిన ఏనుగుల గుంపు
- లోకో పైలట్ బ్రేకులు వేయడంతో తప్పిన పెను ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలో ఏనుగులను ఢీకొట్టడంతో భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటన అస్సాంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. రాత్రి సమయంలో ఒక్కసారిగా ఏనుగుల గుంపు రైల్వే పట్టాలపైకి రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే లోకో పైలట్ స్పందించి వెంటనే బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన తెల్లవారుజామున జరగడంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని లమ్డింగ్ డివిజన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. జమునాముఖ్ – కాంపూర్ సెక్షన్ మధ్య సైరాంగ్ – న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ వెళ్తుండగా ఒక్కసారిగా ఏనుగుల గుంపు పట్టాలపైకి వచ్చింది. వేగంగా దూసుకెళ్తున్న రైలు ఆ గుంపును ఢీకొట్టడంతో ఇంజిన్తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కపింజల్ కిషోర్ శర్మ వెల్లడించారు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
ప్రమాదం జరిగిన వెంటనే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, దెబ్బతిన్న రైల్వే ట్రాక్ను పునరుద్ధరించే పనులను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. అలాగే ఈ ఘటనలో ఏనుగుల మృతిపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!