Train Derailment: ఏనుగులను ఢీకొట్టి పట్టాలు తప్పిన రైలు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- అస్సాంలో తప్పిన రైలు ప్రమాదం
- ఒక్కసారిగా పట్టాలపైకి వచ్చిన ఏనుగుల గుంపు
- లోకో పైలట్ బ్రేకులు వేయడంతో తప్పిన పెను ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంలో ఏనుగులను ఢీకొట్టడంతో భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటన అస్సాంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. రాత్రి సమయంలో ఒక్కసారిగా ఏనుగుల గుంపు రైల్వే పట్టాలపైకి రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే లోకో పైలట్ స్పందించి వెంటనే బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన తెల్లవారుజామున జరగడంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని లమ్డింగ్ డివిజన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. జమునాముఖ్ – కాంపూర్ సెక్షన్ మధ్య సైరాంగ్ – న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ వెళ్తుండగా ఒక్కసారిగా ఏనుగుల గుంపు పట్టాలపైకి వచ్చింది. వేగంగా దూసుకెళ్తున్న రైలు ఆ గుంపును ఢీకొట్టడంతో ఇంజిన్తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కపింజల్ కిషోర్ శర్మ వెల్లడించారు.
Also Read
- Tamil Nadu: రేపు లోక్భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
- Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్ను ఎవరు పాలిస్తారు.?
- Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
- Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..
ప్రమాదం జరిగిన వెంటనే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, దెబ్బతిన్న రైల్వే ట్రాక్ను పునరుద్ధరించే పనులను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. అలాగే ఈ ఘటనలో ఏనుగుల మృతిపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
-
Tamil Nadu: రేపు లోక్భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్ను ఎవరు పాలిస్తారు.?
-
Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
-
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..