Pinarayi Vijayan: కేరళ సీఎంకు ఈడీ నోటీసులు.. దేనికోసమంటే..!

  • కేరళ సీఎంకు ఈడీ నోటీసులు
  • ఫెమా నిబంధనల ఉల్లంఘించారని షోకాజ్ నోటీస్
  • 10-12 రోజుల క్రితమే జారీ
Pinarayi Vijayan

Pinarayi Vijayan

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. మసాలా బాండ్ కేసులో పినరయి విజయన్‌కు, మాజీ మంత్రి ఇస్సాక్‌కు ఈడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు అవసరం లేని ఈ నోటీసును ఫెమా నిబంధనల ప్రకారం ఫెడరల్ దర్యాప్తు సంస్థ 10-12 రోజుల క్రితం జారీ చేసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు సోమవారం అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: PM Modi: సీపీ.రాధాకృష్ణన్ ప్రజా సేవకే జీవితం అంకితం చేశారు.. చైర్మన్‌ను అభినందించిన మోడీ

KIIFB (కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్) అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే ప్రాథమిక సంస్థ. రాష్ట్రంలోని పెద్ద మరియు కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి రూ. 50,000 కోట్లను సమీకరించే ప్రణాళికలో భాగంగా 2019లో తొలి మసాలా బాండ్ జారీ ద్వారా రూ. 2,150 కోట్లు సేకరించింది. రూ. 2,000 కోట్ల వినియోగంపై విదేశీ మార‌క‌పు నిర్వహణ చట్టాన్ని (FEMA) ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ నోటీసులు జారీ అయ్యాయి.

ఇది కూడా చదవండి: PM Modi: ఓటమి నిరాశకు పార్లమెంట్ యుద్ధభూమి కాదు.. విపక్షాలకు మోడీ హితవు