E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E85 Fuel: దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, పెట్రోల్ ధరల భారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో తయారయ్యే E85 ఇంధనాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. మారుతి సుజుకి తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ‘వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్’ ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, సాధారణ పెట్రోల్తో పోలిస్తే E85 ఇంధనం గణనీయంగా చౌకగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ ఇంధనాన్ని ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల్లో మాత్రమే ఉపయోగించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో ప్రస్తుతం సుమారు 30 కోట్ల ద్విచక్ర వాహనాలు, 37 లక్షల ప్రయాణికుల కార్లు ఉన్నాయని పేర్కొన్న మంత్రి, వీటిలో ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ వినియోగం పెరిగితే ఇథనాల్ డిమాండ్ భారీగా పెరుగుతుందని తెలిపారు. కొత్తగా విక్రయించే వాహనాల్లో 50 శాతం ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో వస్తే దేశంలో ఇథనాల్ వినియోగం 4 బిలియన్ లీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. E85 ఇంధనం అంటే 85 శాతం వరకు ఇథనాల్, 15 శాతం పెట్రోల్ కలయికతో తయారయ్యే ప్రత్యేక ఇంధనం. ఇది సాధారణ పెట్రోల్ వాహనాల్లో కాకుండా, ప్రత్యేకంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ల కోసం రూపొందించిన వాహనాల్లో మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఈ ఇంధనం ద్వారా విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు రైతులకు కూడా లాభం చేకూరే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Also Read
- PM Modi: నీట్ విద్యార్థుల కోసం ఎయిర్పోర్టులోనే ఆగిన ప్రధాని మోడీ..
- Uddhav Shiv sena: ముగింపుకు ఉద్ధవ్ సేన సంక్షోభం.. మీడియా ముందుకు తిరుగుబాటు ఎంపీలు..
- PM Modi: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ అగ్రయ్, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ దునగిరి
- Nurse Transfer Request: మంత్రి కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్న నర్సు.. కారణం ఏంటంటే?
E85 ఇంధనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. తొలి దశలో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-పూణే-నాగ్పూర్ కారిడార్లలో 50 నుంచి 100 E85 ఇంధన స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి వీటి సంఖ్యను 500కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2027 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 5,000 E85 ఇంధన స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. హీరో మోటోకార్ప్ ఇప్పటికే స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడళ్లను విడుదల చేసింది. ఈ బైకులు E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమాలతో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
మరోవైపు మారుతి సుజుకి కూడా దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారుగా వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ను పరిచయం చేసింది. కంపెనీ 1.2 లీటర్ K12N పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా రూపొందించిన ఈ వాహనం E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమాలపై పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ వాహనం ఫ్లీట్ ఆపరేటర్లు, క్యాబ్ సేవల సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉండగా, భవిష్యత్తులో వ్యక్తిగత వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇంధన వ్యయాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఇంధన దిగుమతుల తగ్గింపు లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు దేశ రవాణా రంగంలో కీలక మార్పులకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
తాజావార్తలు
-
PM Modi: నీట్ విద్యార్థుల కోసం ఎయిర్పోర్టులోనే ఆగిన ప్రధాని మోడీ..
-
Virat Kohli: వన్డే జట్టులో కోహ్లీ రికార్డుల వేట.. ఇంగ్లాడ్ పై ఆ ఘనత సాధిస్తాడా..?
-
Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్పై నాన్ – బైలబుల్ వారెంట్.. రంగంలోకి దిగిన పోలీసులు! అసలేం జరిగిందంటే..
-
Uddhav Shiv sena: ముగింపుకు ఉద్ధవ్ సేన సంక్షోభం.. మీడియా ముందుకు తిరుగుబాటు ఎంపీలు..
-
Vaibhav Sooryavanshi: ఫైనల్ ముందే శ్రీలంకకు వైభవ్ బిగ్ వార్నింగ్.. సూర్యవంశీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశారా?
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!