NTV Telugu Site icon

Khalistani Terrorist: నవంబర్ 19 వరకు ఎయిరిండియాలో ప్రయాణించొద్దు.. ఖలిస్థానీ టెర్రరిస్టు వార్నింగ్

Panun

Panun

Khalistani Terrorist: కెనడా- యూఎస్‌లలో ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అయితే, సిక్కు మారణహోమం యొక్క 40వ వార్షికోత్సవం సందర్భంగా.. ఎయిర్ ఇండియా విమానంలో దాడి జరగవచ్చని బెదిరింపులు చేశారు. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిరిండియా విమానాలలో ప్రయాణించవద్దని ఈరోజు (సోమవారం) హెచ్చరికలు జారీ చేశారు. అయితే, గత 10 రోజులుగా భారతదేశంలోని అనేక విమానయాన సంస్థలకు బాంబు బెందిరింపుల గురించి పలు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.

Read Also: CM Revanth Reddy: మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతాం.. సికింద్రాబాద్ ఆలయ ఘటనపై సీఎం సీరియస్‌

ఇక, నవంబర్ 2023లో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్చబడుతుందని ఖలీస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులతో కూడిన ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో పన్నూన్ పై నేరపూరిత కుట్ర, మత ప్రాతిపదికన వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు ఉపా చట్టం (UAPA) కింద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేసు నమోదు చేసింది. అయితే, ప్రత్యేక సిక్కు రాష్ట్రం కోసం వాదించే సిక్కుల ఫర్ జస్టిస్ అనే సమూహానికి గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను నాయకత్వం వహిస్తున్నాడు. అతడిపై దేశద్రోహం- వేర్పాటువాదం ఆధారంగా 2020లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది.