Shivraj Singh Chouhan: అమెరికా టారీఫ్లకు భయపడొద్దు.. స్వదేశీ వస్తువుల వినియోగానికి కేంద్రమంత్రి పిలుపు!
- భారత్పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా..
- అమెరికా టారీఫ్స్ కు భయపడొద్దని సూచించిన కేంద్రమంత్రి చౌహాన్..
- స్వదేశీ వస్తువులను వినియోగించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపు..
Shivraj Singh Chouhan: భారత్పై అదనపు సుంకాలను అమెరికా అమలు చేయడంపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా మండిపడ్డారు. ట్రంప్ విధించే పన్నులకు భారతీయులు భయపడొద్దని సూచించారు. ఈ సందర్భంగా స్వదేశీ ఉత్పత్తుల వినియోగానికి పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే మన టార్గెట్.. మన జీవితంలో అవసరమైన అన్ని వస్తువులను మన దగ్గర తయారైనవే కొనాలి అని సూచించారు. వాటిలో మన ఐక్యతను, నిజమైన భారతీయుడిగా నిరూపించుకోవాలని చౌహాన్ పేర్కొన్నారు.
Read Also: Rahul Gandhi: పేదోళ్ల ఓట్లే తొలగించారు.. మరిన్ని ఆధారాలు బయటపెడతా
ఇక, 144 కోట్ల జనాభా భారతదేశం యొక్క బలం.. ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. మన దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయి.. మన ప్రజలకు మాత్రమే కాదు, అవసరమైతే ప్రపంచానికీ కూడా అన్నం పెట్టే సామర్థ్యం మనకు ఉందని చెప్పుకొచ్చారు. శాస్త్రవేత్తలు, రైతులు, వ్యాపారులు, యువ శక్తితో భారత్ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు తీసుకెళ్తాం అని స్పష్టం చేశారు. మరోవైపు, రష్యా ముడి చమురు కొనుగోళ్ల సాకుతో భారత్ పై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు సుమారు 50 శాతం సుంకాలు విధించారు. ఇండియాతో పాటు దాదాపు 70 దేశాలపై విధించిన టారీఫ్స్ అమల్లోకి వచ్చాయి.
తాజావార్తలు
-
MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..
-
Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్ తీసుకుంటున్నారా..?
-
Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
-
Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..
-
CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?