DK Shivakumar: మోడీ నివాసం దగ్గర గుంతలు లేవా? కర్ణాటకలోనే ఉన్నాయా? డీకే.శివకుమార్ ఎదురుదాడి
- మోడీ నివాసం దగ్గర గుంతలు లేవా?
- కర్ణాటకలోనే ఉన్నాయా?
- బీజేపీపై డీకే.శివకుమార్ ఎదురుదాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ సిటీ బెంగళూరులో ప్రధాన రహదారులన్నీ గుంతలమయం అయ్యాయి. దీంతో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు రిపేర్ చేయాలంటూ ఇటీవల బెంగళూరు వాసులు ఆందోళన కూడా చేశారు. అలాగే ప్రతిపక్ష బీజేపీ కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కారణంగా ఐటీ కంపెనీలు తరలిపోతున్నాయని ఆరోపించింది. బెంగళూరు శిథిలావస్థకు చేరుకుంటోందని.. టెక్ హబ్ను గుంతల నగరంగా మార్చారంటూ కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి ఇటీవల ఆరోపించారు. రోడ్డు పరిస్థితులు బాగోలేకపోవడంతో కంపెనీలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయని తెలిపారు. బీజేపీ ఆరోపణలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ స్పందించారు.
‘‘రోడ్లపై గుంతలు కేవలం కర్ణాటకలోనే ఉన్నాయా? నిన్న నేను ఢిల్లీలోకి వెళ్తే ప్రధాని మోడీ నివాస రోడ్డులో కూడా గుంతలు కనిపించాయి. కానీ మీడియా మాత్రం కర్ణాటక రోడ్లనే మాత్రమే చూపిస్తున్నాయి.’’ అని డీకే.శివకుమార్ తిప్పికొట్టారు. భారీ వర్షాలు కారణంగా దేశ వ్యాప్తంగా రోడ్లు గుంతలమయం అయ్యాయన్నారు.
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
అయినా కూడా ఓ వైపు వర్షాలు పడుతున్నప్పటికీ వేలాది గుంతలు పూడ్చుతూనే ఉన్నామని చెప్పారు. దేశ వ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని.. దీనికి బీజేపీనే కారణం అన్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలోనే గుంతలను బీజేపీ చూపిస్తోందని ధ్వజమెత్తారు.
నవంబర్ నాటికి గుంతలను పూడ్చడానికి కాంట్రాక్టర్లకు తుది గడువు ఇచ్చామని, నగరవ్యాప్తంగా రోడ్డు మరమ్మత్తు, నిర్మాణం కోసం రూ.1,100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘మా లక్ష్యం పరిశుభ్రమైన బెంగళూరు, సజావుగా ట్రాఫిక్ సాగడం. గుంతలను వీలైనంత త్వరగా తొలగించేలా చూస్తాం.’’ అని డీకే.శివకుమార్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
-
Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!