కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే.శివకుమార్ లోక్భవన్లో గవర్నర్ను కలిశారు. తదుపరి కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించారు. ఇక సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సమావేశం కానున్నారు. ఈ భేటీలో శాసనసభా పక్ష నేతగా డీకే.శివకుమార్ను ఎన్నుకోనున్నారు. ఇక జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆరోజు మంచి ముహూర్తం కావడం.. అదేరోజు రాహుల్ గాంధీతో పాటు కీలక నేతలంతా అందుబాటులో ఉండడంతో ఆ సమయాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇక భవిష్యత్ ప్లాన్లో భాగంగా భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ప్రణాళిక రచించినట్లుగా తెలుస్తోంది. పలువురు సీనియర్ నాయకులు ప్రభుత్వంలో తరాల మార్పును సమర్థిస్తున్నారు. సలీం అహ్మద్, ఎం. వీరప్ప మొయిలీ సహా పార్టీ నాయకులు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఊపు తెచ్చేందుకు మంత్రివర్గంలోని దాదాపు సగం పదవులను కొత్త ముఖాలకు ఇవ్వాలని సూచించారు. కర్ణాటక వ్యాప్తంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు.. పదవిలో మూడేళ్లు పూర్తి చేసుకున్న మంత్రులను సంస్థాగత పాత్రలకు బదిలీ చేసే చారిత్రాత్మక కామరాజ్ ప్రణాళికను నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కొత్త ప్రభుత్వంలో తన వారికి రెండు డిప్యూటీ సీఎం పోస్ట్లతో పాటు కీలక పదవులు అప్పగించాలని సిద్ధరామయ్య డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే దగ్గర డిమాండ్ పెట్టినట్లుగా సమాచారం. ఇక రాష్ట్ర నాయకత్వంలోనే కొనసాగుతానని సిద్ధరామయ్య తేల్చిచెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
#WATCH | Bengaluru: Former Karnataka Deputy CM and state Congress president DK Shivakumar leaves for CLP meeting, scheduled for 4 pm today. pic.twitter.com/0dK4e7PpXJ
— ANI (@ANI) May 30, 2026
#WATCH | Bengaluru: Former Karnataka Deputy CM and state Congress president DK Shivakumar says, "Oath ceremony will be on 3rd June." pic.twitter.com/JwESuvN7d5
— ANI (@ANI) May 30, 2026

