Disinvestment: మరింత వేగంగా పెట్టుబడుల ఉపసంహరణ… కేంద్రం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి ఉపసంహరణను మరింత వేగం చేయాలని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు సమావేశం అయిన కేంద్ర క్యాబినెట్ మహారత్న,నవరత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థలలో మరింత వేగంగా పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణతో పాటు మైనారిటీ భాగస్వామ్యాలను అమ్మాలని నిర్ణయం తీసుకుంది.
పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా నిర్ణయ అధికారాన్ని ప్రభుత్వ రంగ సంస్థల డైరెక్టర్లకు కట్టుబెడుతూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సబ్సిడరీ సంస్థల మూసివేత, ఉమ్మడి నిర్వహణ సంస్థల యంత్రాంగం మార్పు అధికారం డైరెక్టర్లకు అప్పగించింది. వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం తగ్గించాలని నిర్ణయించింది. స్వతంత్రంగా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే దిశగా నిర్ణయాలు తీసుకునేందుకు డైరెక్టర్లకు అధికారం కల్పించింది.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
వీటితో పాటు ఫ్యూయల్ పాలసీలో పలు మార్పులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. పాలసీలో కొత్తగా ఫీడ్ స్టాక్ అనుమతి ఇచ్చింది. 2030 కల్లా పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను కలిపేందుకు అనుమతి ఇచ్చింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ లో మేకిన్ ఇండియా ప్రోగ్రాం కింద బయో ఫ్యూయల్ ఉత్పత్తికి ప్రోత్సాహం కల్పించేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను వ్యతిరేఖిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పని వ్యాపారం చేయడం కాదని… గతంలో బీజేపీ వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరిస్తోంది. ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేసింది. ఎల్ఐసీ లో కూడా త్వరలోనే పెట్టుబడులను ఉపసంహరించుకోనుంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!