Disinvestment: మరింత వేగంగా పెట్టుబడుల ఉపసంహరణ… కేంద్రం కీలక నిర్ణయం
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి ఉపసంహరణను మరింత వేగం చేయాలని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు సమావేశం అయిన కేంద్ర క్యాబినెట్ మహారత్న,నవరత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థలలో మరింత వేగంగా పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణతో పాటు మైనారిటీ భాగస్వామ్యాలను అమ్మాలని నిర్ణయం తీసుకుంది.
పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా నిర్ణయ అధికారాన్ని ప్రభుత్వ రంగ సంస్థల డైరెక్టర్లకు కట్టుబెడుతూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సబ్సిడరీ సంస్థల మూసివేత, ఉమ్మడి నిర్వహణ సంస్థల యంత్రాంగం మార్పు అధికారం డైరెక్టర్లకు అప్పగించింది. వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం తగ్గించాలని నిర్ణయించింది. స్వతంత్రంగా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే దిశగా నిర్ణయాలు తీసుకునేందుకు డైరెక్టర్లకు అధికారం కల్పించింది.
Also Read
వీటితో పాటు ఫ్యూయల్ పాలసీలో పలు మార్పులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. పాలసీలో కొత్తగా ఫీడ్ స్టాక్ అనుమతి ఇచ్చింది. 2030 కల్లా పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను కలిపేందుకు అనుమతి ఇచ్చింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ లో మేకిన్ ఇండియా ప్రోగ్రాం కింద బయో ఫ్యూయల్ ఉత్పత్తికి ప్రోత్సాహం కల్పించేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను వ్యతిరేఖిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పని వ్యాపారం చేయడం కాదని… గతంలో బీజేపీ వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరిస్తోంది. ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేసింది. ఎల్ఐసీ లో కూడా త్వరలోనే పెట్టుబడులను ఉపసంహరించుకోనుంది.
తాజావార్తలు
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో