Dharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేస్తోంది. రాజీనామా చేస్తేనే ఉద్యమం ఆపుతామని హెచ్చరిస్తోంది. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన రాజీనామాను కోరుతున్నారు. అప్పుడే పార్లమెంట్లో చర్చిస్తామని చెబుతున్నారు. మరోవైపు, సీజేపీ ఈ రోజు కేంద్రంతో జరిగిన చర్చల్లో ధర్మేంద్ ప్రధాన్ రాజీనామాపై తగ్గేదే లేదని చెప్పింది. కేంద్రం దీనిపై రేపటి వరకు సమయం కోరింది.
ఇదిలా ఉంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని, దీనిని సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం పరిగణించడం లేదని, రాజీనామా చేసి బాధ్యతల నుంచి పారిపోవడం వంటిదని కేంద్ర భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారు, ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చే వ్యవస్థను మెరుగుపరుస్తుందని కేంద్రం భావిస్తోంది. బీజేపీతో పాటు, కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్కు అండగా నిలుస్తున్నట్లు సమాచారం.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లోని లోపాలు, సమస్యలను గుర్తిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటిపై ఒక సవివరమైన జాబితాను సిద్ధం చేస్తోందని, సమస్యల పరిష్కరించడానికి త్వరలో అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. పేపర్ లీక్ ప్రమేయం ఉన్న ముఠాలను ఇప్పటికే పట్టుకున్నారు. దర్యాప్తు సంస్థలు తమ దర్యాప్తును వేగవంతం చేశాయి. రాబోయే రోజుల్లో ఈ మాఫియా నెట్వర్క్పై కేంద్రం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. రాజీనామాల రాజకీయాలపై కాకుండా, దేశ పరీక్షా వ్యవస్థను పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చడంపైనే తమ దృష్టి ఉందని ప్రభుత్వం పేర్కొంది.

