New Delhi: ఢిల్లీలో హై అలర్ట్.. ఐబీ హెచ్చరికలతో భారీ భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi On High Alert: దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వేడుకల్లో అశాంతిని సృష్టించేందుకు, అలజడి రేపేందుకు కొన్ని ఉగ్రవాద సంస్థలు, దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ జారీ అయింది. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి.
స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో అల్లర్లు, దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. 10 వేల మంది పోలీసులు ఢిల్లీలో మోహరించారు. గాలిపటాలు, బెలూన్లు ఎగరవేయకుండా 400 మంది సైనికులు రంగంలోకి దిగారు. ఎర్రకోట, ఢిల్లీ పోలీస్ కమాండ్ల చుట్టూ ఉన్న ఎత్తైన భవనాలపై షార్ప్ షూటర్ల మోహరించారు. గాలిపటాలు, డ్రోన్లు ఎగరవేయకుండా నిషేధం విధించారు. వెయ్యికి పైగా సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 13 నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసివేయనున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎలాంటి అపాయాన్ని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నారు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
Read Also: COVID 19: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
75 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతోంది. ఇప్పటికే ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసేలా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా దేశంలో ఉగ్రవాద దాడులు చేసేందుకు లష్కరే తోయిబా, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అయితే వీటన్నింటిని ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు, నిఘా విభాగం భగ్నం చేస్తోంది. ఇటీవల ఢిల్లీలో ఐసిస్ సంబంధం ఉన్న ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఐసిస్ ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారిస్తోంది.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!