New Delhi: ఢిల్లీలో హై అలర్ట్.. ఐబీ హెచ్చరికలతో భారీ భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi On High Alert: దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వేడుకల్లో అశాంతిని సృష్టించేందుకు, అలజడి రేపేందుకు కొన్ని ఉగ్రవాద సంస్థలు, దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ జారీ అయింది. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి.
స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో అల్లర్లు, దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. 10 వేల మంది పోలీసులు ఢిల్లీలో మోహరించారు. గాలిపటాలు, బెలూన్లు ఎగరవేయకుండా 400 మంది సైనికులు రంగంలోకి దిగారు. ఎర్రకోట, ఢిల్లీ పోలీస్ కమాండ్ల చుట్టూ ఉన్న ఎత్తైన భవనాలపై షార్ప్ షూటర్ల మోహరించారు. గాలిపటాలు, డ్రోన్లు ఎగరవేయకుండా నిషేధం విధించారు. వెయ్యికి పైగా సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 13 నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసివేయనున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎలాంటి అపాయాన్ని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నారు.
Also Read
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
Read Also: COVID 19: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
75 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతోంది. ఇప్పటికే ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసేలా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా దేశంలో ఉగ్రవాద దాడులు చేసేందుకు లష్కరే తోయిబా, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అయితే వీటన్నింటిని ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు, నిఘా విభాగం భగ్నం చేస్తోంది. ఇటీవల ఢిల్లీలో ఐసిస్ సంబంధం ఉన్న ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఐసిస్ ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారిస్తోంది.
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!