Delhi Metro: ఢిల్లీ మెట్రో స్టేషన్లో పేలుడు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
- ఢిల్లీ మెట్రో స్టేషన్లో పేలుడు
- బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
- తప్పిన పెను ప్రమాదం
- ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాఫ్రాబాద్ స్టేషన్లో ఈ పేలుడు సంభవించింది. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులంతా కంగారు పడిపోయారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: UK-Russia: పశ్చిమాసియాలో మరో ఘర్షణ.. రష్యా నౌకలను స్వాధీనం చేసుకోవాలని యూకే ఆదేశం
Also Read
- NEET Aspirant Suicide: మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. చివరి వీడియోలో భావోద్వేగ మాటలు..
- Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
- Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
గురువారం సాయంత్రం 6:05 గంటలకు జాఫ్రాబాద్ స్టేషన్లో పేలుడు సంభవించింది. అయితే తెగిపోయిన గాలిపటం దారం హై-వోల్టేజ్ తీగల్లో చిక్కుకోవడంతో ఒక్కసారిగా రెండు పెద్ద పేలుళ్లు సంభవించాయి. అయితే ఏం జరిగిందో తెలియక తీవ్ర గందరగోళం నెలకొంది. పేలుడు శబ్దం వల్ల ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ముందు జాగ్రత్తగా మెట్రో స్టేషన్ ఖాళీ చేయించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని.. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi: మోడీ కాన్ఫరెన్స్కు పలువురు సీఎంలు దూరం.. కారణమిదే!
ఇక ఘటనపై సీఐఎస్ఎఫ్ దర్యాప్తు చేయడంతో అసలు కారణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కుట్ర కాదని, తెగిపోయిన గాలిపటం కారణంగా ఈ పేలుడు సంభవించినట్లుగా పేర్కొంది. కొంతమంది పిల్లలు స్టేషన్ సమీపంలో గాలిపటాలు ఎగురవేస్తుండగా వాటి దారం నేరుగా మెట్రో హై-వోల్టేజ్ విద్యుత్ తీగలకు తగలగానే భారీ షార్ట్ సర్క్యూట్ జరిగి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని వెల్లడించింది. చిన్న అగ్నిప్రమాదం జరిగిందని పేర్కొంది. ప్రయాణికులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని డీసీపీ మెట్రో స్పష్టం చేసింది. పేలుడు జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే మార్గంలో మెట్రో సేవలకు కొద్దిసేపు అంతరాయం కలగడంతో ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగించింది.
జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ కీలకం..
జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ ఈశాన్య ఢిల్లీలోని ఒక సమస్యాత్మక ప్రాంతం . ఇది సీలంపూర్, మౌజ్పూర్, భజన్పురా, యమునా విహార విహార్ వంటి జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రధాన రవాణా కేంద్రంగా పనిచేస్తుంది. పింక్ లైన్లో ఉన్నందున ఇది పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులను ఆకర్షిస్తుంది. అదృష్టవశాత్తూ పరిస్థితిని సకాలంలో అదుపులోకి తీసుకురావడంతో విషాదం తప్పింది.
తాజావార్తలు
-
Ind Vs Afg: టాప్ ఆర్డర్ను నలిపేసిన ప్రసిద్ధ్.. వన్డేల్లో బెస్ట్ స్పెల్తో రికార్డు..
-
AA23 Update: అల్లు అర్జున్ కోసం లోకేష్ కనగరాజ్ స్పెషల్ ప్లాన్.. జూన్ 25న..!
-
NEET Aspirant Suicide: మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. చివరి వీడియోలో భావోద్వేగ మాటలు..
-
Ma Inti Bangaram OTT Update : ‘మా ఇంటి బంగారం’ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ రివీల్
-
UK Grooming Gangs: 2,50,000 మంది అమ్మాయిలపై గ్రూమింగ్ గ్యాంగ్స్ దారుణాలు.. బ్రిటన్లో అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!