Delhi Metro: ఢిల్లీ మెట్రో స్టేషన్లో పేలుడు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
- ఢిల్లీ మెట్రో స్టేషన్లో పేలుడు
- బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
- తప్పిన పెను ప్రమాదం
- ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాఫ్రాబాద్ స్టేషన్లో ఈ పేలుడు సంభవించింది. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులంతా కంగారు పడిపోయారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: UK-Russia: పశ్చిమాసియాలో మరో ఘర్షణ.. రష్యా నౌకలను స్వాధీనం చేసుకోవాలని యూకే ఆదేశం
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
గురువారం సాయంత్రం 6:05 గంటలకు జాఫ్రాబాద్ స్టేషన్లో పేలుడు సంభవించింది. అయితే తెగిపోయిన గాలిపటం దారం హై-వోల్టేజ్ తీగల్లో చిక్కుకోవడంతో ఒక్కసారిగా రెండు పెద్ద పేలుళ్లు సంభవించాయి. అయితే ఏం జరిగిందో తెలియక తీవ్ర గందరగోళం నెలకొంది. పేలుడు శబ్దం వల్ల ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ముందు జాగ్రత్తగా మెట్రో స్టేషన్ ఖాళీ చేయించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని.. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi: మోడీ కాన్ఫరెన్స్కు పలువురు సీఎంలు దూరం.. కారణమిదే!
ఇక ఘటనపై సీఐఎస్ఎఫ్ దర్యాప్తు చేయడంతో అసలు కారణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కుట్ర కాదని, తెగిపోయిన గాలిపటం కారణంగా ఈ పేలుడు సంభవించినట్లుగా పేర్కొంది. కొంతమంది పిల్లలు స్టేషన్ సమీపంలో గాలిపటాలు ఎగురవేస్తుండగా వాటి దారం నేరుగా మెట్రో హై-వోల్టేజ్ విద్యుత్ తీగలకు తగలగానే భారీ షార్ట్ సర్క్యూట్ జరిగి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని వెల్లడించింది. చిన్న అగ్నిప్రమాదం జరిగిందని పేర్కొంది. ప్రయాణికులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని డీసీపీ మెట్రో స్పష్టం చేసింది. పేలుడు జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే మార్గంలో మెట్రో సేవలకు కొద్దిసేపు అంతరాయం కలగడంతో ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగించింది.
జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ కీలకం..
జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ ఈశాన్య ఢిల్లీలోని ఒక సమస్యాత్మక ప్రాంతం . ఇది సీలంపూర్, మౌజ్పూర్, భజన్పురా, యమునా విహార విహార్ వంటి జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రధాన రవాణా కేంద్రంగా పనిచేస్తుంది. పింక్ లైన్లో ఉన్నందున ఇది పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులను ఆకర్షిస్తుంది. అదృష్టవశాత్తూ పరిస్థితిని సకాలంలో అదుపులోకి తీసుకురావడంతో విషాదం తప్పింది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..