IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడు ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్లో సంచలన విషయాలు
- ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య కేసులో సంచలన విషయాలు
- పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరణ
- 4 రోజులు పోలీస్ కస్టడీకి నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం ఉదయం ఐఆర్ఎస్ అధికారి కుమార్తె(22)ను 19 ఏళ్ల రాహుల్ మీనా అత్యంత దారుణంగా హతమార్చాడు. అదేరోజు ద్వారకా ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా పోలీసుల దర్యాప్తులో నిందితుడు చెప్పిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘అగర్ దీదీ పైసే దే దేతీ తో ఐసా నహీ హోతా (అక్క డబ్బు ఇచ్చి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు)..’’.. గతంలో ఇదే ఇంట్లో పనిమనిషిగా పని చేశాడు. దీంతో యువతిని అక్క అని పిలిచేవాడని తెలుస్తోంది. అయితే ఆరోజు ‘‘అలా జరిగిపోయింది.’’ అని పదేపదే పోలీసులకు చెప్పాడు. అక్కను అసలు చంపాలని అనుకోలేదని.. కాకపోతే అలా జరిగిపోయిందని రాహుల్ మీనా పోలీసులకు చెప్పుకొచ్చాడు. తాను కేవలం డబ్బు కోసం మాత్రమే లోపలికి వెళ్లానని.. చంపే ఉద్దేశం అసలు లేదని తెలిపాడు. స్టడీ రూమ్లోకి వెళ్లగానే అక్క ఎందుకు వచ్చావని అడిగిందని.. ‘‘ఆంటీ నన్ను పని కోసం పిలిచారు.’’ అని చెప్పినట్లుగా తెలిపాడు. వెంటనే డబ్బు కావాలని అడిగితే ఇచ్చేందుకు నిరాకరించిందని.. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. కోపంతో ల్యాంప్తో దాడి చేసి మొబైల్ కేబుల్తో గొంతు నులిమి చంపినట్లుగా వాంగ్మూలం ఇచ్చాడు.
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
నిందితుడు రాహుల్ మీనా రాజస్థాన్లోని అల్వాల్లో లూడో గేమ్ ఆడే స్నేహితుడితో పెళ్లికి వెళ్లాడు. అదేరోజు రాత్రి ఒంటరిగా గ్రామానికి వచ్చి స్నేహితుడి భార్యపై బలవంతంగా అత్యాచారం చేశాడు. మొబైల్ దొంగిలించి.. అనుమానం రాకుండా మరో రెండు ఫోన్లతో విక్రయించి.. ఆ డబ్బుతో క్యాబ్ బుక్ చేసుకుని ఢిల్లీకి వచ్చాడు. బుధవారం ఉదయం ఐఆర్ఎస్ అధికారి తన భార్యతో కలిసి జిమ్కి వెళ్లిపోగానే.. అదనపు తాళంతో ఇంట్లోకి ప్రవేశించాడు. నేరుగా స్టడీ రూమ్లోకి వెళ్లగా.. యువతిపై దాడి చేసి అత్యాచారం చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అత్యాచారం జరిగిందా? లేదా? అన్నదానిపై శాంపిల్స్ ల్యాబ్కు పంపించారు. అంతేకాకుండా నిందితుడిని నాలుగు రోజులు కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. విచారణంలో నిందితుడి డీఎన్ఏను సేకరించనున్నారు. ఈ రెండు ఘటనలేనా? ఇంకేమైనా ఉన్నాయా? అన్నదానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!