NTV Telugu Site icon

Delhi: 47 ఫైళ్లను తిరిగి సీఎంవోకు పంపిన లెఫ్టినెంట్ గవర్నర్.. ఎందుకంటే?

Delhi Lieutenant Governor

Delhi Lieutenant Governor

Delhi: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బదులుగా అధికారిక సిబ్బంది సంతకం చేసినందున ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కార్యాలయం 47 ఫైళ్లను తిరిగి ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) తిరిగి పంపింది. ఎల్‌జీ సెక్రటేరియట్ వాపస్ చేసిన ఫైళ్లలో విద్యాశాఖ, వక్ఫ్ బోర్డుకు సంబంధించినవి ఉన్నాయి. అంతకుముందు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయం నుండి ఆమోదం లేదా అభిప్రాయం కోసం పంపిన ప్రతిపాదనలపై “సక్రమంగా సంతకం” చేయాలని కోరుతూ ఆయనకు లేఖ రాశారు. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కార్యాలయం నుంచి లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపిన 45కుపైగా ఫైళ్లపై ఆయన సంతకం లేదు. వీటిపై సీఎం కార్యాలయం అధికారుల సంతకాలున్నాయి. అలాగే ‘సీఎం చూశారు’, ‘సీఎం చూసి ఆమోదించారు’ అని ఆ ఫైళ్లపై పేర్కొన్నారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ సక్సేనా తన లేఖలో ముఖ్యమంత్రికి తెలిపారు.

JP Nadda and Nithiin : జేపీ నడ్డా, హీరో నితిన్‌ భేటీపై సర్వత్రా ఆసక్తి..

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సంతకం చేయకుండా ఫైళ్లను పంపుతుండటంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన నియమ నిబంధనలను పాటించాలని సీఎం కేజ్రీవాల్‌కు సూచించారు. సమర్ధవంతమైన పాలన కోసం ప్రతి ఫైల్‌పై సంతకం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అమలులో ఉన్న ఈ-ఆఫీస్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు. తద్వారా ఫైళ్లు పంపేందుకు అనుకూలంగా ఉంటుందని సీఎం కేజ్రీవాల్‌కు పంపిన లేఖలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేర్కొన్నారు.