Congress MLA Rs 300 Crore Demand: రూ.300 కోట్లు ఇస్తేనే పార్టీలో ఉంటా.. మహిళా ఎమ్మెల్యే డిమాండ్తో కాంగ్రెస్లో కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress MLA Rs 300 Crore Demand: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మలా సప్రే చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ టికెట్పై గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న ఆమె, ఇప్పుడు తన సొంత పార్టీ ఎదుటే భారీ షరతులు పెట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. బీనా అభివృద్ధి కోసం రూ.300 కోట్లు కేటాయించి, బీనాను జిల్లాగా ప్రకటిస్తేనే కాంగ్రెస్లో కొనసాగుతానని ఆమె స్పష్టం చేయడం కలకలం రేపుతోంది.
ఉమాంగ్ సింఘర్కు నేరుగా సవాల్
నిర్మలా సప్రే ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు ఉమాంగ్ సింఘర్కు బహిరంగంగా సవాల్ విసిరారు. “బీనా అభివృద్ధి కోసం రూ.300 కోట్లు ఇవ్వాలి. అదేవిధంగా బీనాను జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఈ రెండు డిమాండ్లు నెరవేరితేనే నేను కాంగ్రెస్తో కొనసాగుతాను” అని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దీనిని “బహిరంగ రాజకీయ బేరసారాలు”గా అభివర్ణించింది.
Also Read
- Sergio Gor: భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది.. పెట్టుబడులకు విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
- Plastic Currency Trend: ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ హవా! కాగితం కరెన్సీకి గుడ్ బై చెప్పిన దేశాలు ఇవే
- El Nino Effect On Stock Market: ఎల్నినో ప్రభావం స్టాక్ మార్కెట్పై పడనుందా.. భారీగా పతనమవ్వనున్న సూచీలు..?
- పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కానీ బీజేపీకి దగ్గరగా?
నిర్మలా సప్రే కాంగ్రెస్ టికెట్పై ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, ఎన్నికల అనంతరం నుంచి ఆమె బీజేపీ కార్యక్రమాల్లో తరచూ కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్తో పాటు పలువురు బీజేపీ నేతలతో వేదికలు పంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో ఆమె త్వరలో బీజేపీలో చేరతారనే ఊహాగానాలు కూడా బలపడ్డాయి. అయితే ఇప్పటి వరకు ఆమె అధికారికంగా పార్టీ మార్పుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
హైకోర్టులో ఫిరాయింపు కేసు
మరోవైపు, నిర్మలా సప్రేపై కాంగ్రెస్ ఇప్పటికే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు కోరుతూ జబల్పూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాంగ్రెస్ ఆరోపణల ప్రకారం, పార్టీ టికెట్పై గెలిచిన తర్వాత నిర్మలా సప్రే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
కాంగ్రెస్ ఫైర్.. బీజేపీ సైలెంట్..
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పీసీ శర్మ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆయన స్పందిస్తూ, “నిర్మలా సప్రే వ్యాఖ్యలు రాజకీయ ఒత్తిడి, బేరసారాల్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రభావితం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది” అని ఆరోపించారు. అయితే, ఈ వివాదంపై ఇప్పటివరకు బీజేపీ అధికారికంగా స్పందించలేదు. అయితే నిర్మలా సప్రే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇక, బీనాను జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతోంది. స్థానికంగా ఇది కీలక రాజకీయ అంశంగా మారింది. ప్రజల అభివృద్ధి, ప్రాంతీయ అవసరాల కోసం తాను ఈ డిమాండ్లు చేస్తున్నానని నిర్మలా సప్రే పేర్కొన్నారు. అయితే ఆమె వ్యాఖ్యలు నిజంగా ప్రజా ప్రయోజనాల కోసమా? లేక రాజకీయ ఒత్తిడి భాగమా? అన్న చర్చ ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
Sergio Gor: భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది.. పెట్టుబడులకు విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
-
Vaibhav Suryavanshi: వైభవ్కు మా షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ దొరికితే ఖతమే.. బుడ్డోడి ఆటకు పాక్ ఫిదా..
-
Vivo T5: వివో T5 మిడ్-రేంజ్ ఫోన్ విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 6s Gen 2 చిప్
-
CM Revanth Reddy : ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
-
Plastic Currency Trend: ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ హవా! కాగితం కరెన్సీకి గుడ్ బై చెప్పిన దేశాలు ఇవే
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!