Site icon NTV Telugu

Car Parking Clash: కారు పార్కింగ్ విషయంలో గొడవ.. రెండు మతాల మధ్య ఘర్షణ

Up

Up

Car Parking Clash: ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలోని సోరాన్ పట్టణంలో కారు పార్కింగ్ విషయంలో జరిగిన చిన్న గొడవ హింసాత్మకంగా మారింది. ఈ వివాదం రెండు మతాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. ఈ ఘర్షణకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసి, కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే, సోరాన్ పట్టణంలో రోడ్డు పక్కన కారు నిలిపి ఉంచడాన్ని ఒక వ్యక్తి అభ్యంతరం చెప్పడంతో ఈ ఘర్షణ ప్రారంభమైంది. కారు తన దారికి అడ్డుగా ఉందని చెబుతూ, కారు యజమాని రియాజ్ అహ్మద్‌ను దానిని అక్కడి నుంచి తరలించమని కోరాడు. దానికి అతడు ఒప్పుకోకపోవడంతో వాగ్వాదం మరింత ముదిరడంతో కోపంతో అతడు ఆ వాహనాన్ని తన్నాడు. దీంతో క్షణాల్లో రెండు వైపుల సభ్యులు గుమిగూడటంతో పరిస్థితి గందరగోళంగా మారింది.

Read Also: Kurnool Bus Accident: డ్రైవర్ అలా చేసి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు.. బాధితుడి ఆవేదన..

ఇక, ఈ గొడవ జరగడంతో కొంత మంది స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి వస్తుండగా, అవతలి వైపు నుంచి కొందరు వారిపై దాడి చేశారని ఆరోపించారు. దీంతో రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకోవడం, కాల్పులు జరపడం ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఉద్రిక్తతలు తలెత్తకుండా నిరోధించడానికి సున్నితమైన ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరించారు. ఈ ఘర్షణలో గాయపడిన రియాజ్ అహ్మద్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, అక్కడి పరిస్థితిని అంచనా వేయడానికి కాస్‌గంజ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సుశీల్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ పోలీసుల బందోబస్తును ముమ్మరం చేశామని చెప్పారు. మేము అనేక ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు సోదాలు చేసి ముగ్గురు అనుమానితులను అరెస్టు చేయడంతో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

Exit mobile version