China-Pakistan: జిత్తులమారి చైనా మరోసారి తన మిత్రదేశం పాకిస్తాన్కు మద్దతు పలుకుతోంది. చైనా తన కొత్త స్టెల్త్ ఫైటర్ జెట్ జె-35ఏఈకి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసింది. ఈ అధునాతన ట్విన్ ఇంజన్ స్టెల్త్ ఫైటర్ను దాయాదికి ఇచ్చేందుకు సిద్ధమైంది. శత్రుదేశాల రాడార్ నుంచి తప్పించుకుని దాడులు చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఇది గగతతలం, భూతల లక్ష్యాలపై దాడులు చేయగలదు.
Read Also: Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
చైనా ఈ జెట్ వీడియోను విడుదల చేసిన తర్వాత, డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్కు 30 నుంచి 40 జె-35ఏఈ జెట్లను విక్రయించవచ్చనే వార్తలు వస్తున్నాయి. 2026 మధ్యలో వీటి డెలివరీలు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికే చైనా నుంచి జే-10సీ ఫైటర్ జెట్ను కొనుగోలు చేసింది. ఒకవేళ జె-35ఏఈను పాకిస్తాన్ కొనుగోలు చేస్తే ఇరు దేశాల మధ్య సైనిక భాగస్వామ్యం మరింత బలపడుతుంది.
ఈ డీల్ ఓకే అయితే భారత్కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు. ఇది 5వ తరం ఫైటర్ జెట్. శత్రువులకు కనిపించకుండా దాడులు చేయడం దీని ప్రత్యేకత. దీనిని అమెరికన్ ఎఫ్-35 లైటనింగ్ 2, ఎఫ్-22 రాప్టర్తో పోల్చవచ్చు. భారత్ వద్ద ఇప్పటికీ 5వ తరం యుద్ధ విమనాలు లేవు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ను 4.5 జనరేషన్ ఫైటర్ జెట్గా భావిస్తాము. సుఖోయ్ ఎస్యూ-57 ఫైటర్ జెట్ను కొనుగోలు చేయాలని రష్యా భారత్ ఆఫర్ చేసింది. భారత్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. పాకిస్తాన్కు చైనా కొత్త జే-35 వస్తే, ఎయిర్ పవర్ భారత్ కన్నా ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో దీనిని బ్యాలెన్స్ చేయడానికి భారత్కు 5వ తరం యుద్ధ విమానం అవసరం అవుతుంది.
