ముఖ్యమంత్రి అంటే ఎంతో బిజిబిజీ షెడ్యూల్తో గడుపుతుంటారు. మంత్రులతో సమీక్షలు, ప్రజలతో మమేకం. ఇలా నిత్యం తీరిక లేకుండా గడుపుతుంటారు. అలాంటి బిజీ షెడ్యూల్ ఉండే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ హఠాత్తుగా పొలం బాట పట్టారు. ఎద్దు, నాగలితో పొలంలోకి దిగి పొలం దున్నుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తర్వాత ముఖ్యమంత్రి విష్ణు దేవ్ ఒక రోజు పర్యటన నిమిత్తం తన పూర్వీకుల గ్రామానికి వచ్చారు. జైపూర్ జిల్లాలోని బగియా గ్రామానికి విచ్చేసి పూర్వీకుల ఇల్లు దర్శించారు. అనంతరం వ్యవసాయాన్ని కూడా పర్యవేక్షించారు. అంతేకాకుండా ఎద్దులకు నాగలి కట్టి పొలం దున్నుతూ రైతులతో పాత జ్ఞాపకాలు చేసుకుంటూ ముందుకు సాగిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. విష్ణు దేవ్ తన ఎక్స్లో ఫొటోలు పంచుకున్నారు. అనంతరం ఒక దివ్యాంగ విద్యార్థినికి ల్యాప్టాప్ బహుకరించారు. ఇక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

