Site icon NTV Telugu

Fodder Scam : లాలూనే దోషి.. తేల్చిన సీబీఐ కోర్టు

దాణా కుంభకోణం కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ను దోషిగా నిర్ధారించిన రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శిక్షల పరిమాణాన్ని ఫిబ్రవరి 18న ఖరారు చేయనున్నారు. దాణా కుంభకోణంలోని మరో నాలుగు కేసుల్లో ఇప్పటికే దోషిగా తేలిన లాలూ ప్రసాద్ చివరి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. విచారణ సందర్భంగా కోర్టులో భౌతికంగా హాజరు కావడానికి ఆర్జేడీ అధినేత ఆదివారం రాంచీకి వచ్చారు. లాలూ ప్రసాద్‌కు సంబంధించిన రూ.139.35 కోట్ల డోరండా ట్రెజరీ దుర్వినియోగం కేసులో జనవరి 29న వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ప్రసాద్‌తో సహా 99 మంది నిందితులపై ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి ఎస్కే శశి గత ఏడాది ఫిబ్రవరి నుంచి విచారణను పూర్తి చేశారు. చివరి నిందితుడు శైలేంద్ర కుమార్ తరఫున వాదనలు జనవరి 29న పూర్తయ్యాయి. తీర్పు వెలువడే రోజున నిందితులందరూ భౌతికంగా కోర్టులో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అయితే 1996లో దాణా కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చింది. దాణ కేసులో 1997లో లాలును నిందితుడిగా సీబీఐ చేర్చింది. 25 ఏళ్ల తర్వాత లాలూప్రసాద్‌ యాదవ్‌ కేసులో సీబీఐ కోర్టు తుది తీర్పునిచ్చింది.

Exit mobile version