Site icon NTV Telugu

Uttarakhand: లోయలో పడ్డ బస్సు.. 22 మంది మృతి

Bus Accident Min

Bus Accident Min

చార్‌ధామ్ యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లో భక్తులతో వెళుతున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. దమ్తా ప్రాంతంలో యమునోత్రి జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 22 మృతదేహాలు లభ్యమయ్యాయి. గాయపడిన మిగతా ఆరుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన యాత్రికులు యమునోత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కాగా మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారేనని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోవడం విషాదకరం అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై తాను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ థామీతో మాట్లాడానని వెల్లడించారు. ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ దళాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయని అమిత్ షా వివరించారు.

Exit mobile version