Haryana: హర్యానా సీఎం సైనీ నివాసానికి బాంబు బెదిరింపు.. హైఅలర్ట్ ప్రకటన
- హర్యానా సీఎం సైనీ నివాసానికి బాంబు బెదిరింపు
- హైఅలర్ట్ ప్రకటన.. తనిఖీలు చేపట్టిన పోలీసులు
హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అధికారిక నివాసానికి, రాష్ట్ర సచివాలయానికి శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. డాగ్ స్క్వాడ్తో సీఎం నివాసాన్ని, సెక్రటేరియట్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇక సచివాలయ ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. అలాగే భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చండీగఢ్ పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Rajendra Prasad: 15 రోజుల వెకేషన్లో సినిమా చేస్తే ఏడాది ఆడింది
Also Read
- Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
- Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
- Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
నయాబ్ సింగ్ అధికారిక నివాసం సంత్ కబీర్ కుటిర్లో.. సచివాలయం చండీగఢ్లో ఉంది. ఈ రెండింటిని ఆత్మాహుతి దాడితో పేల్చేబోతున్నామంటూ ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. ఐఈడీలు ఉపయోగించి ఆత్మాహుతి దాడి జరగవచ్చన్న సందేశం భారీ పరిశ్రమల కార్యదర్శికి వచ్చింది. మధ్యాహ్నం 3:15 నిమిషాలకు ఈ బెదిరింపు వచ్చింది. దీంతో హర్యానా సీఐడీ అప్రమత్తం అయింది. సీఐఎస్ఎఫ్ మరియు పోలీసులు అత్యవసర చర్యలు తీసుకుని రెండు ప్రాంగణాలను ఖాళీ చేయించారు. లోపల ఉన్నవాళ్లు వెంటనే బయటకు రావాలని పోలీసులు ప్రకటన చేశారు. బయటకు రాగానే తనిఖీలు నిర్వహించినట్లు చండీగఢ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉదయ్పాల్ సింగ్ తెలిపారు. బాంబు నిర్వీర్య దళం, అగ్నిమాపక దళం, అంబులెన్స్, క్విక్ రియాక్షన్ బృందాలు, డాగ్ స్క్వాడ్ హై సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: JC Prabhakar Reddy: ఇప్పటికైనా మారు.. లేకపోతే రాజకీయ సమాధే..! జగన్కు జేసీ కీలక సూచనలు
ఇటీవల పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం అయిన స్వాస్థ్య భవన్పై బాంబు దాడి చేయబోతున్నట్లు ఈ మెయిల్ బెదిరింపు వచ్చింది. రెండు రోజుల తర్వాత ఇప్పుడు హర్యానాకు కూడా అదే తరహాలో బాంబు బెదిరింపు వచ్చింది. గత వారం మే 22న కూడా పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుకు ఇలాంటి బాంబు బెదిరింపే వచ్చింది. చండీగఢ్ పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని కొద్దిసేపు ఖాళీ చేయించారు. తనిఖీల తర్వాత బూటకమని తేల్చారు.
తాజావార్తలు
-
Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ..
-
Mercedes CLA EV: భారత్ లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ CLA EV.. 792 km రేంజ్, 800V ఫాస్ట్ ఛార్జింగ్ – పూర్తి వివరాలు
-
Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
-
Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..
-
Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!