Bengal Elections: మరోసారి మమతా వర్సెస్ సువేందు.. బీజేపీ తొలి జాబితా విడుదల..

  • బీజేపీ బెంగాల్ తొలి జాబితా విడుదల..
  • మరోసారి మమతా వర్సెస్ సువేందు అధికారి..
Bengal Fight

Bengal Fight

Bengal Elections: కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికల కోసం షెడ్యూల్ ప్రకటించింది. అయితే, షెడ్యూల్ విడదల కావడంతోనే ఎన్నికల వేడి మొదలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో మరోసారి బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి పోటీ నెలకొంది.

Read Also: A.R. Rahman: ఇండియాలో అత్యధిక ఆస్కార్’లు పొందింది ఎవరో తెలుసా?

సీఎం మమతా బెనర్జీ సిట్టింగ్ నియోజకవర్గం భవానీపూర్‌ నుంచి సువేందును బీజేపీ రంగంలోకి దింపింది. ఆయన ఈ స్థానంతో పాటు నందిగ్రామ్ నుంచి కూడా పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతాను సువేందు ఓడించారు. ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి సవాల్ విసురుతున్నారు. బీజేపీ కీలక నేతలైన దిలీప్ ఘోష్ ఖరగ్‌పూర్ సదర్ నుంచి, అగ్నిమిత్రపాల్ అసన్సోల్ నుంచి, స్వపల్ దాస్ గుప్తా రాష్‌బెహారీ నుంచి పోటీలో ఉన్నారు. తాజాగా విడుదలైన జాబితాలో 41 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలక మళ్లీ బీజేపీ ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చింది.

బెంగాల్ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో నిర్వహించబడతాయని ఎన్నికల సంఘం పేర్కొంది. మే 04న ఫలితాలు వెలువడుతాయి. . 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 215 స్థానాలను గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ 77 స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.