Custodial torture : కస్టడీలో వ్యక్తి ప్రైవేట్ భాగాలపై పెట్రోల్ పోసి నిప్పు..! ముగ్గురు పోలీసులపై చర్యలు..
- బీహార్లో పోలీసుల దారుణం..
- కస్టడీలో వ్యక్తిపై అమానుషంగా హింస..
- ప్రైవేట్ భాగాలపై పెట్రోల్ పోసిన ఘటన..
- ముగ్గురు పోలీసుల సస్పెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Custodial torture : పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి చిత్రహింసలకు గురిచేసిన ఘటన కలకలం సృష్టించింది.. బీహార్ రాష్ట్రంలో పోలీసుల దారుణ ప్రవర్తన తాజాగా వెలుగులోకి వచ్చింది. సమస్తిపూర్ జిల్లాలో దొంగతనం ఒప్పుకోలని ఒక ఆభరణాల దుకాణ కార్మికుడిని పోలీస్ కస్టడీలో తీవ్రంగా హింసించిన ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. డిసెంబర్ నెలలో సమస్తిపూర్లోని ఒక ఆభరణాల దుకాణం నుంచి 60 గ్రాముల బంగారం దొంగతనం జరిగిన కేసులో ఆ దుకాణంలో పనిచేసే వ్యక్తితో పాటు అతని ఇద్దరు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించకపోయినా, అతడిని నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచారు.
Read Also: Chiranjeevi: పొట్ట కోటి కోసం పొట్ట మాడ్చుకున్నా
Also Read
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
బాధితుడి ఆరోపణల ప్రకారం, కస్టడీలో ఉన్న సమయంలో పోలీసులు అతడిని తీవ్రంగా కొట్టి, ఒప్పుకోలని బలవంతం చేశారు. అంతేకాదు, అతని ప్రైవేట్ భాగాలపై పెట్రోల్ పోసి కాల్చేస్తామని బెదిరించినట్లు కూడా తెలిపాడు. ఈ హింస కారణంగా అతని ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగు రోజుల కస్టడీ అనంతరం జనవరి 5న అతడిని బాండ్పై విడుదల చేశారు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత అతని పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, దొంగతనం జరిగిన దుకాణ యజమాని కూడా ఆ వ్యక్తిని మరియు ఇతర ఉద్యోగులను కొట్టి, పోలీసులకు అప్పగించే ముందు వారిని బిల్డింగ్ పై నుంచి తోసేస్తానని బెదిరించినట్లు బాధితుడు వెల్లడించాడు.
బాధితుడి తల్లి మాట్లాడుతూ.. ఈ కేసులో తమపై కుట్ర పన్నారని ఆరోపించారు. తమ కుమారుడితో పాటు తనను, భర్తను కూడా మూడు రోజుల పాటు తాజ్పూర్ పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారని చెప్పారు. కుటుంబ సభ్యులను విడుదల చేయడానికి పోలీసులు రూ.50 వేల లంచం డిమాండ్ చేశారని కూడా ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో సమస్తిపూర్ పోలీస్ సూపరింటెండెంట్ అరవింద్ ప్రతాప్ సింగ్ విచారణకు ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలడంతో తాజ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ శంకర్ శరణ్ దాస్తో పాటు రాజ్వంశ్ కుమార్, రాహుల్ కుమార్ అనే ఇద్దరు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపగా, పోలీస్ కస్టడీలో మానవ హక్కుల ఉల్లంఘనలపై మరోసారి చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!