BJP Leader: షారూఖ్ ఖాన్ ‘‘దేశద్రోహి’’.. బంగ్లా బౌలర్ కొనుగోలుపై బీజేపీ నేత విమర్శలు..
- వివాదంగా బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ కొనుగోలు..
- కేకేఆర్ జుట్టులో ఆడనున్న బంగ్లా స్టార్ ఆటగాడు..
- షారూఖ్ ఖాన్ను టార్గెట్ చేస్తూ బీజేపీ నేత విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leader: బంగ్లాదేశ్లో మైనారిటీలు ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ మతోన్మాదులు దాడులుకు పాల్పడుతున్నారు. గత రెండు వారాల్లో ముగ్గురు హిందువుల్ని దారుణంగా చంపేశారు. అయితే, దీని ప్రభావం బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్పై పడుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు, కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఇటీవల వేలంలో బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ను కొనుగోలు చేసింది. దాదాపు రూ.9.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడం సంచలనంగా మారింది. అయితే, ఇప్పుడు ముస్తాఫిజుర్ను కొనుగోలు చేయడంపై బీజేపీతో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు.
Also Read
- BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- Abhishek Banerjee: "నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు".. చిక్కుల్లో మమత మేనల్లుడు
- Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
యూపీకి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కొనుగోలు చేసిన షారూఖ్ ఖాన్ను ‘‘దేశద్రోహి’’గా అభివర్ణించారు. “ఒకవైపు బంగ్లాదేశ్లో హిందువులను చంపుతున్నారు, మరోవైపు ఐపీఎల్లో క్రికెటర్లను కొనుగోలు చేస్తున్నారు. దేశద్రోహి అయిన సినీ నటుడు షారుఖ్ ఖాన్ బంగ్లాదేశ్ క్రికెటర్ రెహమాన్ను రూ. 9 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇలాంటి దేశద్రోహులకు ఈ దేశంలో జీవించే హక్కు లేదు,” అని మీరట్లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో సోమ్ అన్నారు. “ఈ దేశ ప్రజలు మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చడానికి సహాయం చేశారు. మీకు డబ్బు వస్తే, అది ఈ దేశం నుండే వస్తుంది. కానీ మీరు దేశానికి ద్రోహం చేశారు,” అని అన్నారు.
రెహ్మాన్ వంటి ఆటగాళ్లు భారత్ వస్తే విమానాశ్రయం నుంచి బయటకు అడుగు పెట్టలేడు అని బీజేపీ నేత హెచ్చరించారు. ఆధ్యాత్మిక గురువు దేవకినందన్ ఠాకూర్ కూడా షారుఖ్ ఖాన్ను రెహమాన్ను కొనుగోలు చేసినందుకు తీవ్రంగా విమర్శించారు, అతనిని జట్టులో చేర్చవద్దని KKR యాజమాన్యానికి చెప్పారు. కేకేఆర్ యజమానిని స్టార్గా చేసిన హిందువులు, బంగ్లాదేశ్లో చంపబడుతుంటే, బాలికపై దాడులు జరుగుతుంటే, వాటిని పరిగణలోకి తీసుకోకుండా తన జట్టులోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకుంటున్నాని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Ajay Bhupathi: “శ్రీనివాస మంగాపురం” ఆడియో బ్లాక్బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
-
BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
-
NSE Trading Hours Change: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయం మార్పు.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన!
-
Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
-
Lashkar-e-Taiba: భారత్ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..