Ram Mandir: అయోధ్య రామ మందిరంలో కానుకల దొంగతనం వ్యవహారం నేపత్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక సమావేశం సోమవారం జరిగింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శ చంపత్ రాయ్, సభ్యులు అనిల్ మిశ్రాలు చేసిన రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. పాపంలో పాలుపంచుకున్న ఎవరైనా శిక్షింబడుతారు అని ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ అన్నారు. ఇదిలా ఉంటే, ఈ చోరీపై సిట్ విచారణ జరుపుతోంది. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం ఉందని ట్రస్ట్ చెప్పింది. ఈ దొంగతనం ట్రస్ట్, రామ భక్తులు, సాధారణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. చంపత్ రాయ్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినప్పటికీ, ఆయన ట్రస్టీగా కొనసాగనున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి.
చంపత్ రాయ్ రాజీనామా ఆమోదంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే వారిలో బజ్రంగ్ బగ్రా ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది. బగ్రా వీహెచ్పీ విశ్వ హిందూ పరిషత్ (VHP) అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్, ప్రభుత్వ రంగ సంస్థ (PSU) అయిన ‘నాల్కో’ (NALCO)కు చీఫ్గా పనిచేశారు. బగ్రా అనుభవం ట్రస్ట్ పనితీరును మెరుగుపరుస్తుందని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు, ఈ వ్యవహారం ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ముందు పొలిటికల్ వివాదంగా మారింది. బీజేపీ, యోగి ఆదిత్యనాథ్ సర్కార్పై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

