Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ మా భూభాగమే అని పదే పదే వాదిస్తున్న చైనాకు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అరుణాచల్ ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ చైనా మ్యాప్లు విడుదల చేస్తూనే ఉంటుందని, కానీ అలాంటి వాదనలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని ఆయ అన్నారు. షిల్లాంగ్లో బుధవారం జరిగిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (NEC) 73వ ప్లీనరీ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అరుణాచల్పై చైనా చేస్తున్న వాదనలు అర్ధరహితం అని కొట్టిపారేశారు. రాష్ట్రం అభివృద్ధి, మౌలిక సదుపాయాల్లో దూసుకెళ్తోందని చెప్పారు. అరుణాచల్ను జాంగ్నాన్, దక్షిణ టిబెట్గా చైనా చెప్పడంపై పెమా ఖండూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా అరుణాచల్ లోని పలు ప్రాంతాలు, కొండలు, నదులకు, గ్రామాలకు చైనా సొంత పేర్లు పెడుతోంది. పదేపదే చైనా వాదనల్ని భారత్ తిరస్కరిస్తోంది, అరుణాచల్ భారత్లో అవిభాజ్య భాగమని స్పష్టం చేస్తోంది.
పెమా ఖండూ మాట్లాడుతూ.. ‘‘ఇది 1962 కాదు’’ అని స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. 1962 భారత్-చైనా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాకు చైనాతో సరిహద్దు లేదు. మాకు టిబెట్తో సరిహద్దు ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలలో టిబెట్ చైనాలో అంతర్భాగం కాదని చెప్పకనే చెప్పారు.
