‘పినరయి’ పంతంపై ప్రశంసలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కమ్యూనిస్టులకు కంచుకోట ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒక్కటి. కేరళీయులు రాజకీయాల్లో విభిన్న వైఖరిని అవలంభిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీ మరోసారి అధికారంలోకి రావడం అనేది కష్టం. అలాంటిది గత ఎన్నికల్లో పినరయి విజయన్ వరుసగా రెండోసారి విక్టరీ సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఎన్నికల ముందు ఆయనపై విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా కేరళీయులు పినరయి వైపే మొగ్గుచూపారు. దీంతో కేరళకు ఆయనే మరోసారి సీఎం అయ్యారు.
పినరయి విజయన్ అధికారంలోకి వచ్చాక కేరళ అనేక అటుపోట్లకు గురైంది. ప్రకృతి ప్రకోపానికితోడు మానవ తప్పిదాల వల్ల కేరళ అతలాకుతలం అవుతోంది. తుఫానులు, వరదలు, కరోనా ఎఫెక్ట్ తో కేరళ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోంటోంది. ఇప్పటికీ కూడా కేరళను వరదలు వదలడం లేదు. దీనికితోడు కరోనాను తొలినాళ్లలో సమర్థవంతంగా ఎదుర్కొన్న కేరళలో ఇప్పుడు వేలాదిగా కేసులు నమోదు అవుతుండటం శోచనీయంగా మారింది. కరోనా అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అదుపులోకి రావడం లేదని తెలుస్తోంది.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
కరోనా ప్రభావం రాష్ట్రంపై పడటంతో పినరయి విజయన్ శక్తి మించిన అప్పులు చేశారు. ప్రస్తుతం ఆ రాష్ట్రం మూడు లక్షల కోట్ల అప్పుతో నడుస్తోంది. ఇదే అదనుగా కేంద్ర ప్రభుత్వం కేరళలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేయిటీకరించేందుకు సిద్ధమైంది. ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ తరహాలోని కేరళలోని బీహెచ్ఈఎల్ ను ప్రవేటీకరించేందుకు కేంద్రం దూకుడు పెంచింది. ఈక్రమంలోనే ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పినరయి విజయన్ కేంద్రానికి ఎలాంటి అవకాశం లేకుండా బీహెచ్ఈఎల్ ను ఆదుకునేందుకు ముందుకురావడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కేరళలోని కాసరగూడలో బీహెచ్ఈఎల్-ఎంఎల్ సంస్థ ఉంది. ఈ సంస్థలో నష్టాలను సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే కేరళ సర్కారు మాత్రం కేంద్రానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తాజాగా ముందస్తు చర్యలను చేపట్టింది. ఈ సంస్థ కోసం దాదాపు 77కోట్ల రూపాయాలను కేరళ సర్కారు ఖర్చుచేసి తన ఆధీనంలోకి తీసుకుంది. అదేవిధంగా గడిచిన రెండేళ్లుగా ఉద్యోగులకు బకాయిపడిన దాదాపు 14కోట్ల రూపాయాలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది.
దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల హక్కులను కాపాడుకోవడంలో కమ్యూనిస్టులు ఎప్పుడు ముందుంటారని కేరళ సర్కారు నిరూపించింది. దీంతో కేరళ దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచింది. పంతం పట్టీ మరీ పినరయి విజయన్ బీహెచ్ఈఎల్ ను కాపాడటం అభినందనీయమని పలువురు ఆయనపై ప్రశంసంలు కురిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!