Annamalai: అన్నామలై రాజీనామా చేయలేదా..?
- అన్నామలై రాజీనామా వార్తలతో రాజకీయాల్లో కలకలం
- ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో కీలక భేటీ
- అన్నాడీఎంకే పొత్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అన్నామలై
- ఇంకా పార్టీకి రాజీనామా చేయలేదని వర్గాల సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: అన్నామలై వ్యవహారం బీజేపీలో హాట్ టాపిక్గా మారింది. ఆయన పార్టీకి రాజీనామా చేశారనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే, ఈ విషయాన్ని బీజేపీ గానీ, అన్నామలై కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఆయన పార్టీలో ఉన్నారా? బయటకు వెళ్లారా.? అనేది ఇంకా క్లారిటీ లేదు. బీజేపీ వైఖరి పట్ల కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ వెళ్లిన అన్నామలై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్, సంస్థాగత కార్యదర్శి బి.ఎల్. సంతోష్లతో సహా బీజేపీ అగ్ర నాయకులను కలిశారు.
అన్నామలై అసంతృప్తితో ఉన్నప్పటికీ ఇంకా రాజీనామా చేయలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం పార్టీ అగ్రనేతల్ని కలిసిన అన్నామలై, తమిళనాడులో బీజేపీ పనితీరుపై తనకు ఉన్న అభ్యంతరాలను వారికి వివరించారు. ఇటీవల ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు వల్ల పార్టీ భవిష్యత్తుపై ప్రభావం పడినట్లు తెలిపారు. బీజేపీ సొంతంగా బలం పెంచుకోవాలని అన్నామలై తొలి నుంచి వాదిస్తున్నారు. అన్నాడీఎంకేతో పొత్తుపై ఆయన అయిష్టంగానే ఉన్నారు. తమిళనాడు ఎన్నికలకు ముందు పొత్తు కుదరాలంటే అన్నామలైని బీజేపీ తమిళనాడు పార్టీ అధ్యక్షుడిగా తొలగించాలని అన్నాడీఎంకే షరతు పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్కసీటుకే పరిమితమైంది.
Also Read
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
- Modi-Trump: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వేగం.. ఏఐ రంగంలో సహకారానికి రెడీ
- India - Iran Talks: ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై కీలక చర్చలు.. భారత్ తదుపరి అడుగు ఏంటి?
ఇదే సమయంలో కొంత మంది బీజేపీ, అన్నాడీఎంకే నాయకుల వైఖరి పట్ల అన్నామలై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన లేవనెత్తిన అంశాలను రాష్ట్ర నాయకులతో చర్చిస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం సమావేశంలో అన్నామలై రాజీనామా అంశంపై చర్చ జరగలేదని తెలుస్తోంది. తమిళనాడులో ప్రజా సంబంధ కార్యక్రమాలను ప్రారంభించేందుకు అన్నామలై చేస్తున్న ప్రణాళికలకు సహకరిస్తామని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అన్నామలై లేవనెత్తిన విషయాలను చర్చించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ను ఢిల్లీకి పిలిపించారు.
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!