Annamalai: అన్నామలై రాజీనామా చేయలేదా..?
- అన్నామలై రాజీనామా వార్తలతో రాజకీయాల్లో కలకలం
- ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో కీలక భేటీ
- అన్నాడీఎంకే పొత్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అన్నామలై
- ఇంకా పార్టీకి రాజీనామా చేయలేదని వర్గాల సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: అన్నామలై వ్యవహారం బీజేపీలో హాట్ టాపిక్గా మారింది. ఆయన పార్టీకి రాజీనామా చేశారనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే, ఈ విషయాన్ని బీజేపీ గానీ, అన్నామలై కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఆయన పార్టీలో ఉన్నారా? బయటకు వెళ్లారా.? అనేది ఇంకా క్లారిటీ లేదు. బీజేపీ వైఖరి పట్ల కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ వెళ్లిన అన్నామలై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్, సంస్థాగత కార్యదర్శి బి.ఎల్. సంతోష్లతో సహా బీజేపీ అగ్ర నాయకులను కలిశారు.
అన్నామలై అసంతృప్తితో ఉన్నప్పటికీ ఇంకా రాజీనామా చేయలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం పార్టీ అగ్రనేతల్ని కలిసిన అన్నామలై, తమిళనాడులో బీజేపీ పనితీరుపై తనకు ఉన్న అభ్యంతరాలను వారికి వివరించారు. ఇటీవల ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు వల్ల పార్టీ భవిష్యత్తుపై ప్రభావం పడినట్లు తెలిపారు. బీజేపీ సొంతంగా బలం పెంచుకోవాలని అన్నామలై తొలి నుంచి వాదిస్తున్నారు. అన్నాడీఎంకేతో పొత్తుపై ఆయన అయిష్టంగానే ఉన్నారు. తమిళనాడు ఎన్నికలకు ముందు పొత్తు కుదరాలంటే అన్నామలైని బీజేపీ తమిళనాడు పార్టీ అధ్యక్షుడిగా తొలగించాలని అన్నాడీఎంకే షరతు పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్కసీటుకే పరిమితమైంది.
Also Read
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
- DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా 'ఆధార్' లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
- Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశాం..
ఇదే సమయంలో కొంత మంది బీజేపీ, అన్నాడీఎంకే నాయకుల వైఖరి పట్ల అన్నామలై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన లేవనెత్తిన అంశాలను రాష్ట్ర నాయకులతో చర్చిస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం సమావేశంలో అన్నామలై రాజీనామా అంశంపై చర్చ జరగలేదని తెలుస్తోంది. తమిళనాడులో ప్రజా సంబంధ కార్యక్రమాలను ప్రారంభించేందుకు అన్నామలై చేస్తున్న ప్రణాళికలకు సహకరిస్తామని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అన్నామలై లేవనెత్తిన విషయాలను చర్చించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ను ఢిల్లీకి పిలిపించారు.
తాజావార్తలు
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
-
S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
-
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!