Site icon NTV Telugu

Mumbai: బీచ్ శుభ్రం చేసిన అక్షయ్ కుమార్, అమృత ఫడ్నవీస్

Sam (4)

Sam (4)

ముంబైలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ గణేష్ నిమజ్జనం సందర్భంగా బీచ్ లో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్, అక్షయ్ కుమార్, బీఎంసీ కమిషనర్ డాక్టర్ భూషణ్ గగ్రాని పరిశుభ్రతా ప్రచారంలో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా చెత్త పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దివ్య ఫౌండేషన్, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా జుహు బీచ్‌లో పరిశుభ్రతా ప్రచారాన్ని ప్రారంభించాయి.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతతో సహా అందరు ప్రజలు పరిశుభ్రతా ప్రచారంలో చేరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అమృత ఫడ్నవీస్, అక్షయ్ కుమార్ తదితరులు పరిశుభ్రతా ప్రచారంలో ఎలా ఉత్సాహంగా పాల్గొంటున్నారో చూడవచ్చు. మహారాష్ట్రలో గణేశోత్సవం గొప్ప విశ్వాసం, భక్తి, ఉత్సాహంతో జరుపుకునే పండుగ. ముఖ్యంగా అనంత చతుర్దశి రోజున, జుహు, గిర్గావ్ మరియు వెర్సోవా ప్రధాన బీచ్‌లలో గణేష్ విగ్రహాలను పెద్ద ఎత్తున నిమజ్జనం చేస్తారు.

ఈ నిమజ్జనం కారణంగా, బీచ్‌లలో విగ్రహాలు, నిర్మాల్య, పువ్వులు, దండలు మరియు ఇతర పూజా సామగ్రి అవశేషాల రూపంలో పెద్ద మొత్తంలో చెత్త ఉత్పత్తి అవుతుంది, ఇది పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ తీవ్రమైన సమస్యను దృష్టిలో ఉంచుకుని, దివ్యజ్ ఫౌండేషన్, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కలిసి జుహు బీచ్‌లో శుభ్రతా డ్రైవ్ నిర్వహించారు.

అమృత ఫడ్నవిస్ మాట్లాడుతూ …ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ దేశవ్యాప్తంగా పరిశుభ్రత పట్ల అవగాహన పెంచిందని అన్నారు. ఈ ప్రచారం మన సముద్రాన్ని శుభ్రంగా అందంగా ఉంచడమేనన్నారామె. పరిశుభ్రత ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత. ఈ ప్రచారంలో పాల్గొన్న అన్ని వయసుల వారిని ఆమె ప్రశంసించారు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు, బాలీవుడ్ నటుల నుండి సాధారణ పౌరుల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని, దీని కారణంగా పరిశుభ్రత సందేశం సమాజంలోని అన్ని స్థాయిలకు చేరుకుందని అన్నారు.

Exit mobile version