Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. అయితే, దీనికి ముందే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్లకు అఖిలేష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అఖిలేష్ వ్యాఖ్యలతో ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో వేడిపుట్టింది. ఒక కార్యక్రమంలో ఎస్పీ చీఫ్ మాట్లాడుతూ.. ‘”నేను మళ్ళీ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకు ఆఫర్ చేస్తున్నాను: 100 మంది ఎమ్మెల్యేలను తీసుకువచ్చి ముఖ్యమంత్రి అవ్వండి” అంటూ కామెంట్స్ చేశారు.
Read Also: Allu Arjun: మెగా రికార్డుకు రీచ్ అయిన పుష్పరాజ్.. తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్!
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి మనీష్ శుక్లా స్పందించారు. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ నిరాశను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. అఖిలేష్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కాకుండా పోగో ఛానల్లోని పాత్రలా కనిపిస్తున్నాడని, ఆయన టీవీలో కనిపించినప్పుడల్లా ప్రజలు నవ్వడం ప్రారంభిస్తారని ఎద్దేవా చేశారు. తీవ్రమైన సమస్యల గురించి కూడా ఆయన జోకులు వేస్తారని, ప్రజలు ఆయనను సీరియస్గా తీసుకోవడం లేదని శుక్లా అన్నారు.
యూపీ సీఎం యోగి ఫిబ్రవరి 22 రాత్రి సింగపూర్, జపాన్ అధికారిక పర్యటనలకు వెళ్తున్నారు. జపాన్లో ఆయన గంటలకు 600 కి.మీ వేగంతో నడిచే మాగ్లెవ్ రైలులో ప్రయాణిస్తారు. టోక్యో-నగోయా మాగ్లెవ్ కారిడార్ను కూడా పరిశీలిస్తారు. పెట్టుబడిదారులతో సమావేశమవుతారు.
