Site icon NTV Telugu

ఎయిర్ ఇండియా డేటా దొంగలించిన సైబర్ నేరగాళ్లు…

క్రెడిట్ కార్డులు, పాస్‌పోర్ట్‌లు, ఫోన్ నంబర్‌లతో సహా పదేళ్లకు సంబంధించిన విలువైన ఎయిర్ ఇండియా కస్టమర్ డేటా ఫిబ్రవరిలో భారీ సైబర్ నేరగాళ్లు దొంగలించినట్లు ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఈ సంఘటనలో 2011 ఆగస్టు 26 నుండి 2021 ఫిబ్రవరి 3 మధ్య ఉన్న 45 లక్షల మంది కస్టమర్ల సమాచారం లీక్ అయినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత ఇప్పుడు వెల్లడించింది ఎయిర్ ఇండియా. ప్యాసింజర్ సిస్టమ్ ఆపరేటర్ ను లక్ష్యంగా చేసుకున్న ఈ సైబర్ అటాక్ లో ప్రయాణికుల పేర్లు, పుట్టిన తేదీ, టికెట్ సమాచారం అని లీక్ అయ్యాయి. ఇక ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు… అలాగే ఇక మీదట ఇలా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

Exit mobile version