AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIADMK Crisis: తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయినా.. కాంగ్రెస్, లెఫ్ట్ సహా ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు టీవీకే అధినేత విజయ్.. ఇక, అసెంబ్లీలో విజయ్ సర్కార్ బలనిరూపణ సమయంలో అనూహ్యంగా కొంత మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు విజయ్కు పద్దతు ప్రకటించారు.. దీంతో, ఆ పార్టీలో విభేదాలు ఉన్నాయనేది స్పష్టమైంది.. అయితే, అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం రోజురోజుకు మరింత ముదురుతోంది. గత పది రోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు పార్టీని రెండు వర్గాలుగా చీల్చేశాయి. పార్టీ నాయకత్వంపై ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా రెండు శిబిరాలుగా విడిపోయి బహిరంగంగా తమ బలం ప్రదర్శించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) నాయకత్వంలో ఒక వర్గం కొనసాగుతుండగా, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఆధ్వర్యంలో మరో వర్గం ఏర్పడింది. ఈపీఎస్కు మాజీ మంత్రి కేసీ వీరమణి మద్దతు ప్రకటించడం రాజకీయ పరిణామాలకు మరింత వేడి తెచ్చింది. తమ వర్గానికే పార్టీపై పూర్తి అధికారం ఉందని ఇరు వర్గాలు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలోని సచివాలయంలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను రెండు వర్గాల నేతలు విడివిడిగా కలిశారు. తమ వైపే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని స్పీకర్కు వివరించారు. ఈపీఎస్ వర్గం తరఫున 22 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారని పేర్కొనగా, వేలుమణి వర్గం తమకు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టం చేసింది.
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
ఇక, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్ను మాత్రమే గుర్తిస్తామని మాజీ మంత్రి కేసీ వీరమణి ప్రకటించారు. మరోవైపు పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఎస్పీ వేలుమణి వర్గాన్ని పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఈపీఎస్ వర్గం వెల్లడించింది. దీంతో అన్నాడీఎంకేలో రాజకీయ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది.. పార్టీలో నెలకొన్న ఈ అంతర్గత సంక్షోభం భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలపై కీలక ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల బలం, పార్టీ గుర్తింపు, నాయకత్వ వివాదం తదితర అంశాలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!